
సమస్యల పరిష్కారానికే సదస్సులు
దుద్యాల్: భూ సమస్యలను క్షేత్రస్థాయిలో పరిష్కరించేందుకే రెవెన్యూ సదస్సులు నిర్వహిస్తున్నట్లు అడిషనల్ కలెక్టర్ లింగ్యా నాయక్ తెలిపారు. మంగళవారం మండలంలోని హకీంపేట్లో నిర్వహించిన భూ భారతి సదస్సును ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. జిల్లా వ్యాప్తంగా చాలా మంది రైతులు భూ సమస్యలను ఎదుర్కొంటున్నారని, వాటిని పరిష్కరించేందుకు ప్రభుత్వం కొత్త చట్టాన్ని అందుబాటులోకి తెచ్చిందన్నారు. రెవెన్యూ సదస్సులకు మంచిస్పందన వస్తోందని పేర్కొన్నారు. హకీంపేట్ నుంచి తొమ్మిది ఫిర్యాదులు వచ్చాయని వివరించారు. మండల వ్యాప్తంగా 310 దరఖాస్తులు వచ్చినట్లు తహసీల్దార్ కిషన్ తెలిపారు. కార్యక్రమంలో డీటీ వీరేశ్ బాబు, సిబ్బంది పక్కిరప్ప, ఊషప్పతదితరులు పాల్గొన్నారు. అనంతరం గ్రామంలోనిరాకమకొండ వేంకటేశ్వర స్వామిని అదనపు కలెక్టర్ లింగ్యా నాయక్ దర్శించుకున్నారు. ప్రత్యేక పూజలు నిర్వహించి తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. ఆలయ ధర్మకర్త రాకం యాదయ్య ఆయన్ను సన్మానించారు.
సద్వినియోగం చేసుకోవాలి
పరిగి: గ్రామాల్లో నిర్వహిస్తున్న భూభారతి రెవెన్యూ సదస్సులను రైతులు సద్వినియోగం చేసుకోవాలని అదనపు కలెక్టర్ లింగ్యానాయక్ సూచించారు.మంగళవారం మండలంలోని గోవిందపూర్లో నిర్వహించిన సదస్సును ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా రైతులు ఇచ్చిన అర్జీలను పరిశీలించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. భూ సమస్యలు ఉన్న రైతులు దరఖాస్తు చేసుకుంటే పరిష్కరిస్తామని తెలిపారు. కార్యక్రమంలో తహసీల్దార్ ఆనందర్రావు తదితరులు పాల్గొన్నారు.
అడిషనల్ కలెక్టర్ లింగ్యానాయక్
మండలంలో ముగిసిన రెవెన్యూ సదస్సులు