
సదరం సర్టిఫికెట్లు అందజేయండి
అనంతగిరి: సదరం క్యాంపుల్లో వైద్య పరీక్షలు చేయించుకున్న దివ్యాంగులకు ధ్రువీకరణ పత్రాలను అందజేయాలని, ఈ ప్రక్రియను రెండు నెలల్లో పూర్తి చేయాలని కలెక్టర్ ప్రతీక్ జైన్ అధికారులను ఆదేశించారు. మంగళవా రం కలెక్టరేట్లోని తన చాంబర్లో సదరం/యూడీఐడీ శిబిరాల నిర్వహణపై డీఆర్డిఓ, వైద్య శాఖ అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లా డుతూ.. జిల్లాలోని దివ్యాంగులకు సదరం, యూడీఐడీ శిబిరాల ద్వారా ధ్రువీకరణ పత్రాలు అందజే యాలన్నారు. 689 మంది పరీక్షలు పూర్తి చేసుకొని పత్రాల కోసం ఎదురు చూస్తున్నారని ప్రత్యేక శిబిరాలు ఏర్పాటు చేసి వారికి అందజేయాలని సూచించారు. క్యాంపులకు వచ్చే ప్రతి ఒక్కరికీ పరీక్షలు నిర్వహించి అర్హులైన వారికి ధ్రువీకర ణ పత్రాలను అందజేయాలన్నారు. సమావేశంలో డీఆర్డీఓ శ్రీనివాస్, జిల్లా ఆస్పత్రి సూపరింటెండెంట్ రాంచంద్రయ్య, కొడంగల్, వికారాబాద్ వైద్య కళాశాలల ప్రిన్సిపాళ్లు పద్మ, మ ల్లికార్జున్, డీపీఎం నర్సింలు, ఏపీఎం కమలాకర్ తదితరులు పాల్గొన్నారు.
రెండు నెలల్లో ప్రక్రియ పూర్తి కావాలి
కలెక్టర్ ప్రతీక్ జైన్