
విద్యార్థులకు ఉచిత బస్పాస్లు ఇవ్వాలి
ఎస్ఎఫ్ఐ నాయకుల డిమాండ్
తాండూరు టౌన్: విద్యార్థుల నుంచి ఎలాంటి రుసుం తీసుకోకుండా ఉచితంగా బస్పాస్లు ఇవ్వాలని స్టూడెంట్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా (ఎస్ఎఫ్ఐ) జిల్లా అధ్యక్షుడు రాజ్కుమార్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. మంగళవారం ఈ మేరకు తాండూరు ఆర్టీసీ డిపో సిబ్బందికి వినతి పత్రం అందజేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. ఆర్టీసీ యాజమాన్యం విద్యార్థుల బస్పాస్ చార్జీలను 20 శాతం మేర పెంచడం సమంజసం కాదన్నారు. గ్రామీణ ప్రాంతాల నుంచి సమీపంలోని పట్టణ ప్రాంతాలకు వచ్చి చదువుకునే పేద, మధ్య తరగతి విద్యార్థులపై బస్పాస్ చార్జీల పెంపు తీవ్ర ప్రభావాన్ని చూపుతుందన్నారు. వెంటనే పెంచిన చార్జీలను తగ్గించాలన్నారు. అంతేకాకుండా ప్రభుత్వం చొరవ తీసుకుని విద్యార్థులకు ఉచిత బస్పాస్ సౌకర్యం కల్పించాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ డివిజన్ కార్యదర్శి శ్రీధర్, నాయకులు ప్రకాష్, రాజు, పలువురు విద్యార్థులు పాల్గొన్నారు.
పాఠశాలల్లో ప్రవేశాలకు దరఖాస్తుల ఆహ్వానం
కొడంగల్: తెలంగాణ స్పోర్ట్స్ అథారిటీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ప్రభుత్వ క్రీడా పాఠశాలల్లో ప్రవేశాలకు విద్యార్థులు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలని ఎంఈఓ రాంరెడ్డి మంగళవారం సూచించారు. 2025 – 26 విద్యా సంవత్సరానికి గాను 4వ తరగతిలో ప్రవేశం కోసం దరఖాస్తు చేసుకోవాలన్నారు. హకీంపేట, కరీంనగర్, ఆదిలాబాద్లోని క్రీడా పాఠశాలలకు మూడు అంచెల్లో ఎంపిక విధానం ఉంటుందన్నారు. జూన్ 16 నుంచి 19వ తేదీ వరకు మండల స్థాయి ఎంపిక, జూన్ 23 నుంచి 26వ తేదీ వరకు జిల్లా స్థాయిలో ఎంపిక, జులై 1 నుంచి 5వ తేదీ వరకు రాష్ట్ర స్థాయిలో ఎంపిక ఉంటుందన్నారు. మూడు పాఠశాలల్లో బాలికలకు 60 సీట్లు, బాలురకు 60 సీట్లు ఉన్నాయని తెలిపారు. అనంతరం పట్టణంలోని జిల్లా పరిషత్ బాలికల ఉన్నత పాఠశాలలో నూతనంగా చేరిన విద్యార్థులకు నోటు పుస్తకాలు, స్కూల్ దుస్తులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులకు మెరుగైన విద్యతో పాటు మౌలిక సదుపాయాలు కల్పిస్తున్నట్లు తెలిపారు. అల్పాహారం, మధ్యాహ్న భోజనం, తాగునీరు, ఉచితంగా పుస్తకాలు, దుస్తులు ఇస్తున్నట్లు చెప్పారు. విద్యార్థులు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని కోరారు. తల్లిదండ్రులు వారి పిల్లలను ప్రభుత్వ పాఠశాలల్లోనే చేర్పించాలని ఆయన కోరారు.
సకాలంలో
బిల్లులు చెల్లిస్తాం
హౌసింగ్ డీఈఈ ఖలీమొద్దీన్
తాండూరు రూరల్: ఇందిరమ్మ ఇళ్లు నిర్మించుకుంటే త్వరగా బిల్లులు అందజేస్తామని హౌసింగ్ డీఈఈ ఖలీమొద్దీన్ అన్నారు. మంగళవారం పెద్దేముల్ మండలం కందనెల్లి గ్రామంలో ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఇల్లు నిర్మించుకునే వారికి నాలుగు దశల్లో బిల్లులు చెల్లిస్తామన్నారు. పునాది పనులు పూర్తి కాగానే మొదటి బిల్లు రూ.లక్ష, గోడలు కట్టిన తర్వాత మరో రూ.లక్ష, స్లాబ్ వేసిన తర్వాత రూ.2 లక్షలు, ఇంటి నిర్మాణం పూర్తయిన తర్వాత మరో రూ.లక్ష అందజేస్తామని తెలిపారు. అధికారులు సూచించిన ప్రకారమే ఇంటి నిర్మాణం చేపట్టాలని సూచించారు. కార్యక్రమంలో హౌసింగ్ ఏఈ రహీం, పంచాయతీ కార్యదర్శి, లబ్ధిదారులు పాల్గొన్నారు.

విద్యార్థులకు ఉచిత బస్పాస్లు ఇవ్వాలి

విద్యార్థులకు ఉచిత బస్పాస్లు ఇవ్వాలి