
పుస్తకాల దందాను అడ్డుకోండి
తాండూరు టౌన్: నిబంధనలకు విరుద్ధంగా పుస్తకా లు విక్రయిస్తున్న ప్రైవేటు పాఠశాలల యాజమా న్యాలపై చర్యలు తీసుకోవాలని బీసీ జేఏసీ నాయకులు డిమాండ్ చేశారు. ఈ మేరకు మంగళవారం తాండూరు మండల విద్యాధికారి వెంకటయ్య గౌడ్కు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ప్రైవేటు పాఠశాలలు ఇష్టానుసారంగా పుస్తకాల ధరలను నిర్ణయించడంతో పాటు, నేరుగా వారే విక్రయిస్తున్నారని ఆరోపించారు. విద్యాశాఖాధికారులు స్పందించి ప్రైవేటు పాఠశాలల పుస్తకాల విక్రయ దందాను అడ్డుకో వాలని డిమాండ్ చేశారు.
ఎంఈఓను కోరిన బీసీ జేఏసీ నాయకులు