చేసిన సేవలే గుర్తుండిపోతాయి

పదవీవిరమణ పొందిన కండక్టర్లను సన్మానిస్తున్న అధికారులు, సిబ్బంది తదితరులు   - Sakshi

అనంతగిరి: విధి నిర్వహణలో మనం చేసిన సేవలే ఎల్లవేళలా గుర్తుండిపోతాయని ఆర్టీసీ డీఎం బక్షినాయక్‌ అన్నారు. ఈమేరకు శుక్రవారం డిపోకు చెందిన ఇద్దరు కండక్టర్లు సులోచన, స్వామిదాసు పదవీ విరమణ పొందారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సన్మాన కార్యక్రమంలో అధికారులు సిబ్బంది, సహచరులు ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆర్టీసీలో ప్రయాణికుల సురక్షిత ప్రయాణానికి ప్రాధాన్యత ఇస్తామన్నారు. ఇద్దరు కూడా కండక్టర్లుగా ఎంతో క్రమశిక్షణతో పనిచేసి మంచి పేరు తెచ్చి పెట్టారన్నారు. కార్యక్రమంలో ఉద్యోగులు పాల్గొన్నారు.

Read latest Vikarabad News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top