తిరుమల: తిరుమల శ్రీవారిని శుక్రవారం పలువురు ప్రముఖులు దర్శించుకున్నారు. వారిలో సుప్రీం కోర్టు న్యాయమూర్తి జస్టిస్ అరవింద్కుమార్, ఏపీ హైకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ తుహీన్కుమార్, జస్టిస్ సుభేందు సమంత, కర్ణాటక హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ విజయకుమార్ పటేల్, ఏపీ హైకోర్టు మాజీ న్యాయమూర్తులు జస్టిస్ యు.దుర్గాప్రసాద్ రావు, జస్టిస్ శివశంకర్ రావు, ఏపీ డీజీపీ హరీష్ కుమార్గుప్త, ఎంపీ పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి, మహారాష్ట్ర ఎంపీ ఓంప్రకాష్ బాపర్, ఎంపీ శ్రీకాంత్ ఏక్నాథ్ షిండే, ఎంపీ శ్రీరంగ అప్పబర్నే, ఎమ్మెల్సీ కళ్యాణి ఉన్నారు.


