తిరుపతి సిటీ: రాష్ట్ర సాంకేతిక విద్యాశాఖ ఎట్టకేలకు 24వ తేదీ నుంచి పాలిసెట్–2026 కౌన్సెలింగ్ ప్రక్రియ జరపనుంది. గత ఏప్రిల్ 25వ తేదీన జరిగిన పాలిసెట్ పరీక్ష ఫలితాలు మే 5వ తేదీన విడుదలయ్యాయి. ఫలితాలు విడుదలై సుమారు 45 రోజులపైన గడుస్తున్నా కౌన్సెలింగ్ ప్రక్రియ చేపట్టకపోడంతో జిల్లాలో పాలిసెట్లో ఉత్తీర్ణత సాధించిన సుమారు 4,438 మంది విద్యార్థులు కౌన్సెలింగ్ ప్రక్రియ కోసం ఎదురుచూస్తున్నారు. ఈ నేపథ్యంలో ఉన్నత విద్యామండలి ఎట్టకేలకు కౌన్సెలింగ్ ప్రక్రియ తేదీలను ప్రకటించడంతో విద్యార్థులు, తల్లిదండ్రులు ఊపిరి పీల్చుకున్నారు.
కౌన్సెలింగ్ ప్రక్రియ తేదీలు


