
ఇంటర్ అడ్మిషన్ల గడువు పెంపు
తిరుపతి ఎడ్యుకేషన్ : జిల్లావ్యాప్తంగా ఇంటర్మీడియట్ జూనియర్ కళాశాలల్లో అడ్మిషన్లకు ఈ నెల 30వ తేదీ వరకు గడువు పొడిగించినట్లు ఆర్ఐఓ జి.రాజశేఖర్రెడ్డి తెలిపారు. సోమవారం ఆయన మాట్లాడుతూ అడ్మిషన్ల గడువు తేదీని పొడిగిస్తూ ఇంటర్ బోర్డు ఉత్తర్వులు జారీ చేసిందని, ఈ అవకాశాన్ని విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.
సౌభాగ్యదాయకం..
‘సుందరకాండ’
తిరుపతి అన్నమయ్యసర్కిల్ : సుందరకాండ సకల సౌభాగ్యదాయకమని, హనుమంతుని అనుగ్రహంతో ఏదైనా సాధించే శక్తిని పొందగలమని శతావధాని ఉప్పలఽ దడియం భరత్ శర్మ ప్రవచించారు. సోమవారం తిరుపతిలోని అన్నమాచార్య కళామందిరంలో సుందరకాండ, హనుమద్వైభవంపై భరత్ శర్మ ఆధ్యాత్మిక ప్రవచనం చేపట్టారు. అందులో భాగంగా రామాయణ మహత్మ్యం, సుందరకాండ విశిష్టత, అంతరార్థం, హనుమంతుని చాకచక్యం, శ్రీరాముని కార్యంపై అంజనీసుతుని దీక్ష, నేటి సమాజంలో ఇతిహాసాల అన్వయం తదితర విశేషాలను భరత్ శర్మ వివరించారు.మహర్షుల వా/్మయం మొత్తం వైజ్ఞానికమే అని, ప్రస్తుత సమాజంలో మానవుని జీవనానికి దిశానిర్దేశం చేస్తుందని వెల్లడించారు. ఈ సందర్భంగా భరత్శర్మను రాయలసీమ రంగస్థలి చైర్మన్ గుండాల గోపీనాథ్, కళాకారులు టీచర్ తిరుమలయ్య, ప్రభాకర్నాయుడు, సుబ్రమణ్యంరెడ్డి, సురేష్ స్వామి సత్కరించారు. కార్యక్రమంలో భారతీయ విద్యాభవన్ డైరెక్టర్ సత్యనారాయణరాజు పాల్గొన్నారు.