రోడ్డు ప్రమాదంలో యువకుడి మృతి | - | Sakshi
Sakshi News home page

రోడ్డు ప్రమాదంలో యువకుడి మృతి

May 12 2025 6:56 AM | Updated on May 12 2025 6:56 AM

రోడ్డు ప్రమాదంలో యువకుడి మృతి

రోడ్డు ప్రమాదంలో యువకుడి మృతి

చిట్టమూరు : నాయుడుపేట– మల్లా రహదారిపై ఆదివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ యువకుడు మృతి చెందాడు. వివరాలు.. కోట మండలం జరుగుమల్లికి చెందిన ఉదయగిరి సుధీర్‌(24) నాయుడుపేట మండలం మేనకూరు వద్ద ఓ ప్రైవేట్‌ కంపెనీలో పనిచేస్తున్నాడు. ఈ క్రమంలో కోటలో తన స్నేహితుడి పెళ్లికి వెళ్లేందుకు మరో మిత్రుడు శివతో కలిసి బైక్‌పై బయదేరాడు. మార్గం మధ్యలో చిట్టమూరు మండలం కొత్తగుంట వద్ద ఆటో ఢీకొంది. ఈ ప్రమాదంలో సుధీర్‌ అక్కడికక్కడే మరణించాడు. శివ తీవ్రంగా గాయపడ్డాడు. ఎస్‌ఐ చిన్న బలరామయ్య వెంటనే ఘటనాస్థలానికి చేరుకుని క్షతగాత్రుడిని వాకాడు ప్రభుత్వాస్పత్రికి తరలించారు. మృతదేహాన్ని నాయుడుపేట ఏరియా వైద్యశాలకు పోస్టుమార్టం నిమిత్తం తీసుకెళ్లారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement