ఛాంపియన్స్‌ ఆఫ్‌ లెర్నింగ్‌గా వర్చ్యుసా...

Virtusa Recognized As Champion Of The Learning - Sakshi

సాక్షి, సిటీబ్యూరో: శరవేగంగా అన్ని లావాదేవీలూ డిజిటల్‌ మయంగా మారిపోతున్న పరిస్థితుల్లో... సంబంధిత అంశాలపై శిక్షణా అవగాహన తరగతులు కూడా ఊపందుకున్నాయి. ఔత్సాహికుల కోసం నిర్వహిస్తున్న ఈ తరహా కార్యక్రమాల్లోనూ పోటీ పెరిగింది. అదే క్రమంలో అలాంటి వాటిలో ఉత్తమమైన వాటిని గుర్తించడమూ ప్రాధాన్యత కలిగిన అంశమైంది. ఈ తరహా సేవలు అందిస్తున్న సంస్థల శిక్షణా సామర్ధ్యానికి గుర్తింపునిచ్చే  పురస్కారాలూ షురూ అయ్యాయి.

అదే క్రమంలో ఐటి, సొల్యూషన్స్, డిజిటల్‌ వినియోగంలో అవసరమైన సేవలు, అందించే వర్చ్యుసా కార్పొరేషన్‌... ఛాంపియన్‌ ఆఫ్‌ లెర్నింగ్‌ గుర్తింపును సాధించింది. ఈ విషయాన్ని సంస్థ ప్రతినిధులు తెలిపారు. అసోసియేషన్‌ ఫర్‌ టాలెంట్‌ డెవలప్‌మెంట్‌ (ఎటిడి) నుంచి వర్చ్యుసా ఈ గుర్తింపును అందుకుంది.

3500 మంది 7500 గంటలు...
లెర్నర్స్‌వీక్‌..విశేషాలివీ...

గత డిసెంబరు 7వ తేదీ నుంచి 11వ తేదీ వరకూ ఈ లెర్నర్స్‌ వీక్‌ నిర్వహించారు. వరుసగా నాలుగో ఏడాది ఈ గుర్తింపును తమ సంస్థ దక్కించుకుందని తమ సంస్థ నిర్వహిస్తున్న లెర్నర్స్‌ వీక్‌ వంటి వార్షిక కార్యక్రమాలతో పాటు, ఈ ఏడాది అందించిన 240కిపైగా కోర్సులు వంటివి ఈ గుర్తింపునకు అర్హత సాధించిపెట్టాయని సంస్థ ప్రతినిధులు అంటున్నారు. ఈ ఏడాది టెక్నికల్, ప్రాసెస్, డొమైన్, బిహేవియరల్, కమ్యూనికేషన్‌ డిసిప్లైన్స్‌... తదితర అంశాలను తాము అందించామన్నారు. ఈ కార్యక్రమానికి దాదాపుగా 3,500కిపైగా అభ్యర్ధులు లాగిన్‌ అయ్యారని, 7,500 గంటలకు పైగా శిక్షణ కొనసాగిందని వివరించారు. సెల్ఫ్‌ ఎన్‌హాన్స్‌మెంట్, ఆడియోబుక్స్, వెబ్‌–సిరీస్,  హ్యాండ్స్‌ ఆన్‌ అప్లికేషన్‌ సిమ్యులేషన్స్, డెవ్‌ఓప్స్, డేటా అనలిటిక్స్‌ వంటివి ఇందులో భాగంగా ఉన్నాయన్నారు.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top