ప్రధాని అపాయింట్‌మెంట్‌ కేసీఆర్‌ అడగలేదు | Telangana CM KCR Did Not Ask PM Modi Appointment, Confirmed PMO | Sakshi
Sakshi News home page

ప్రధాని అపాయింట్‌మెంట్‌ కేసీఆర్‌ అడగలేదు

Nov 26 2021 3:02 AM | Updated on Nov 26 2021 5:14 AM

Telangana CM KCR Did Not Ask PM Modi Appointment, Confirmed PMO - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, కేంద్ర హోం మంత్రి అమిత్‌షాను కలవడానికి వీలుగా ఇటీవల తెలంగాణ రాష్ట్ర సీఎం కార్యాలయం లేదా ప్రభుత్వం నుంచి ఎలాంటి విజ్ఞప్తి రాలే దని కేంద్ర ప్రభుత్వ వర్గాలు గురువారం స్పష్టం చేశాయి. అయితే గత సెప్టెంబర్‌ 1వ తేదీన అపా యింట్‌మెంట్‌ కోసం విజ్ఞప్తి వచ్చిందని, దాంతో అదే నెల 3వ తేదీన అపాయింట్‌మెంట్‌ ఇవ్వడం, సీఎం కేసీఆర్‌ వారిని కలవడం జరిగిం దని గుర్తు చేశాయి. నీటి పంపకాలు, వరి ధాన్యం కొను గోలుపై కేంద్రంతో అమీతుమీ తేల్చుకోవ డానికి ఢిల్లీ వెళ్తామని, అవసరమైతే తాను ప్రధానిని కలు స్తానని గత శనివారం సీఎం విలేకరుల సమా వేశంలో చెప్పిన సంగతి తెలిసిందే.

కాగా ఆ మరు సటి రోజే ఢిల్లీ బయ ల్దేరి వెళ్లిన సీఎం బుధవా రం సాయంత్రం హైదరా బాద్‌ తిరిగి చేరు కున్నారు. అయితే నాలుగు రోజుల పాటు ఢిల్లీలో ఉన్న కేసీఆర్‌.. మోదీని, అమిత్‌ షాను కలిసేందుకు అపాయింట్‌మెంట్‌ కోరినా ఇవ్వలేదని టీఆర్‌ఎస్‌ వర్గాలు ఆరోపించాయి. ఈ నేపథ్యంలోనే కేంద్ర ప్రభుత్వ వర్గాలు స్పష్టత ఇచ్చా యి. ప్రధాని అపాయింట్‌మెంట్‌ కోరుతూ తమకు ఎలాంటి వర్తమానం అందలేదని తెలిపాయి. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement