హైదరాబాద్‌కు కాంగ్రెస్‌ ప్రముఖులు | Randeep Singh Surjewala Arrived In Hyderabad | Sakshi
Sakshi News home page

హైదరాబాద్‌కు కాంగ్రెస్‌ ప్రముఖులు

Aug 17 2021 1:43 AM | Updated on Aug 17 2021 1:43 AM

Randeep Singh Surjewala Arrived In Hyderabad - Sakshi

సోమవారం హైదరాబాద్‌లోని మధుయాష్కీ నివాసంలో రణదీప్‌ సింగ్‌ సూర్జేవాలాను  మర్యాద పూర్వకంగా కలసిన దాసోజు శ్రవణ్‌ , ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, రేవంత్‌రెడ్డి 

సాక్షి, హైదరాబాద్‌: ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి, వర్కింగ్‌ కమిటీ సభ్యుడు రణదీప్‌సింగ్‌ సూర్జేవాలా సోమవారం హైదరాబాద్‌కు వచ్చారు. కర్ణాటక కాంగ్రెస్‌ చీఫ్‌ డి.కె.శివకుమార్, ఆ రాష్ట్ర మాజీ సీఎం సిద్ధరామయ్య కూడా విడిగా హైదరాబాద్‌కు చేరుకున్నారు. రాయచూర్‌లో జరిగే ఓ కార్యక్రమానికి ఢిల్లీ నుంచి వెళ్తూ ఈ ముగ్గురు మార్గమధ్యలో హైదరాబాద్‌లో బసచేశారు. టీపీసీసీ ప్రచార కమిటీ చైర్మన్, కర్ణాటక కాంగ్రెస్‌ సహ ఇన్‌చార్జి మధుయాష్కీగౌడ్‌ నివాసానికి వెళ్లిన వీరు కొంతసేపు అక్కడ విశ్రాంతి తీసుకుని రాయచూర్‌కు వెళ్లారు. వీరిని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి, సీనియర్లు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, పొన్నాల, ఏఐసీసీ అధికార ప్రతినిధి దాసోజు శ్రవణ్‌ మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement