ఏ మతాన్నీ కించపరచలేదు: రాజాసింగ్‌

Raja Singh Clarifies His Controversial Comments Hyderabad - Sakshi

నాపై కేసులను న్యాయపరంగా ఎదుర్కొంటా: రాజాసింగ్‌

పార్టీ నోటీసులపై వీలైనంత తొందరగా సమాధానమిస్తానని వివరణ 

సాక్షి, హైదరాబాద్‌: తాను చేసిన వీడియోలో ఏ మతాన్నీ కించపర్చలేదని బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్‌ పేర్కొన్నారు. అయితే కోర్టు ఆదేశాల నేపథ్యంలో ఈ అంశానికి సంబంధించి తాను మాట్లా డలేనని తెలిపారు. తనపై నమోదైన కేసులను న్యాయపరంగా ఎదుర్కొంటానన్నారు. బీజేపీ జాతీయ క్రమశిక్షణ కమిటీ ఇచ్చిన షోకాజ్‌ నోటీసుపై సమాధానం ఇస్తానని చెప్పారు.

తాను ఇచ్చే వివరణతో పార్టీ సంతృప్తి చెందు తుందని, బీజేపీ తనను వదులుకోబోదని భావిస్తున్నానని పేర్కొన్నారు. పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌పై తనకు పూర్తి నమ్మకం ఉందన్నారు. కాగా స్వామి పరిపూర్ణా నంద బుధవారం రాజాసింగ్‌ నివాసానికి వెళ్లి కలిశారు. రాజాసింగ్‌ను పరామర్శించి, అరెస్టుకు దారితీసిన పరిణామాలు, అరెస్ట్, అనంతరం విడుదల, కేసుకు సంబంధించిన వివరాలను తెలుసుకున్నారు.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top