అర్హత ఉన్నా.. మెరిట్‌ లిస్ట్‌లో పేరున్నా జాబ్‌ రాలే..

Negligence In Job Recruitment In Adilabad - Sakshi

సాక్షి, మంచిర్యాల: ఎంఎస్సీ నర్సింగ్‌ అర్హత ఉండి మెరిట్‌ లిస్ట్‌లో పేరున్నా తమకు కాకుండా బీఎస్సీ నర్సింగ్‌ అభ్యర్థులకు జాబ్‌ ఇచ్చారని, తమకు జరిగిన అన్యాయంపై సోమవారం అభ్యర్థులు కలెక్టర్‌ భారతి హోళ్లికేరి, డీఎంహెచ్‌ఓ సుబ్బరాయుడుకు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఎంఎస్సీ, బీఎస్సీ నర్సింగ్‌ అభ్యర్థులతో భర్తీ చేయాల్సి ఉండగా కేవలం బీఎస్సీ వారికే అవకాశం ఇచ్చారన్నారు. అంతేకాకుండా ఎస్సీ క్యాటగిరీలో ఒక్కరికి కూడా అవకాశం ఇవ్వలేదన్నారు.

అధికారులు ఏ ప్రాతిపదికన నియామకం చేశారో అర్థం కావడంలేదని ఆవేదన వ్యక్తం చేశారు. దీనిపై విచారణ జరిపించి న్యాయం చేయాలని కోరారు. బీసీ విద్యార్థి సంఘం రాష్ట్ర వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ అల్లి సాగర్, ఎన్‌ఎస్‌ఎఫ్‌ రాష్ట్ర అధ్యక్షుడు జుమ్మిడి గోపాల్, ఏఐఎఫ్‌డీఎస్‌ జిల్లా కార్యదర్శి సబ్బని రాజేంద్రప్రసాద్, తెలంగాణ విద్యార్థి సమాఖ్య జిల్లా అధ్యక్షుడు క్రాంతికుమార్, పీడీఎస్‌యూ రాష్ట్ర వైస్‌ ప్రెసిడెంట్‌ తోట రాజేష్‌ పాల్గొన్నారు.  

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top