ఆకుకూరలు అమ్ముతున్న సర్పంచ్ | Mahabubnagar Tribal Woman Sarpanchi Sales Vegetables | Sakshi
Sakshi News home page

ఆకుకూరలు అమ్ముతున్న సర్పంచ్

Feb 5 2021 9:20 AM | Updated on Feb 5 2021 9:20 AM

Mahabubnagar Tribal Woman Sarpanchi Sales Vegetables - Sakshi

సాక్షి, మహబూబ్‌నగర్‌: ఈ చిత్రంలో ఆకుకూరలు విక్రయిస్తున్న మహిళ మహబూబాబాద్‌ జిల్లా రేగడి తండా గ్రామ పంచాయతీకి ఏకగ్రీవంగా ఎన్నికైన సర్పంచ్‌ గుగులోతు లక్ష్మీ రామచంద్రు. జీవనోపాధికోసం తమ కుటుంబానికున్న భూమిలో ఆకుకూరలను పండించి ప్రతీరోజు ఉదయం మహబూబాబాద్‌ జిల్లా కేంద్రంలోని కూరగాయల మార్కెట్‌కు వాటిని తీసుకొచ్చి విక్రయిస్తోంది. ఇదేమిటని అడిగితే ఊరికి పెదై్దతేనేం ఉపాధికి ఢోకా లేదని రూలేమీ లేదుగా!..ప్రభుత్వం నుంచి అందే అరకొర జీతం బండి పెట్రోల్‌ ఖర్చులకు కూడా సరిపోవడం లేదయ్యా.. అందుకే మన పని మనం చేసుకుంటే తప్పేముందని బదులిచ్చింది. శ్రమ జీవన సౌందర్యమంటే ఇదేనేమో కదూ!!  
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement