ఆగస్టు 13–15 వరకు 25 కోట్ల జాతీయ జెండాల ఆవిష్కరణ  | Inauguration Of 25 Crore National Flags From August 13 To 15: Kishan Reddy | Sakshi
Sakshi News home page

ఆగస్టు 13–15 వరకు 25 కోట్ల జాతీయ జెండాల ఆవిష్కరణ 

Jul 24 2022 1:10 AM | Updated on Jul 24 2022 7:42 AM

Inauguration Of 25 Crore National Flags From August 13 To 15: Kishan Reddy - Sakshi

స్వామీజీ నుంచి ఆశీర్వాదం తీసుకుంటున్న కిషన్‌రెడ్డి 

కాచిగూడ: దేశవ్యాప్తంగా ఆగష్టు 13, 14, 15 తేదీల్లో 25 కోట్ల జాతీయ జెండాలను ఎగురవేయనున్నట్లు కేంద్ర సాంస్కృతిక, పర్యాటక, ఈశాన్య రాష్ట్రాల అభివృద్ధి శాఖమంత్రి జి.కిషన్‌రెడ్డి ప్రకటించారు. ఉడిపి శ్రీ పేజావర మఠాధీశుల 35వ చాతుర్మాస దీక్షలో భాగంగా ఉడిపి పేజావర ఫీఠాధిపతి శ్రీశ్రీశ్రీ విశ్వప్రసన్న తీర్థ స్వామీజీ నగరానికి వచ్చిన సందర్భంగా శనివారం బర్కత్‌పురలో స్వామీజీని కలిసి కిషన్‌రెడ్డి ఆశీర్వాదం తీసుకున్నారు.

ఆజాదీ కా అమృత్‌ మహోత్సవం సందర్భంగా దేశంలోని ప్రజలు స్వాతంత్య్ర ఉద్యమ స్ఫూర్తిని చాటాలని పిలుపునిచ్చారు. ఆంగ్లేయులను దేశం నుంచి తరిమికొట్టేందుకు సమరశీలంగా స్వాతంత్య్ర ఉద్యమం సాగిందని ఆయన గుర్తుచేశారు. దేశంలోని ప్రజలంతా వాడవాడల్లో, వీధుల్లో జాతీయ జెండాలను ఎగురవేయాలని కోరారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement