‘తెలంగాణను తాగుబోతుల రాష్ట్రంగా మార్చారు’

Hyderabad: Etela Rajender Slams Brs Party Over Liquor Policy - Sakshi

సాక్షి, కామారెడ్డి రూరల్‌/రామారెడ్డి: దేశంలో అత్యధికంగా మద్యం తాగే రాష్ట్రం తెలంగాణ అని.. గ్రామగ్రామాన బెల్టు షాపులు ఏర్పాటు చేసి తాగుబోతుల తెలంగాణగా మార్చారని మాజీ మంత్రి, హుజూరాబాద్‌ ఎమ్మెల్యే ఈటల రాజేందర్‌ ధ్వజమెత్తారు. గురువారం కామారెడ్డి జిల్లాలో పర్యటించిన ఆయన పలు కార్యక్రమాల్లో పాల్గొన్నారు.

ఈ సందర్భంగా మాట్లాడుతూ శాసనసభలో ప్రజా సమస్యలను చర్చిద్దామంటే ప్రభుత్వం మైకును కట్‌ చేసి తమ గొంతు నొక్కుతోందన్నారు.  తెలంగాణ వస్తే విదేశాలకు వలసలు ఆగుతాయని ఉద్యమ సమయంలో కేసీఆర్‌ చెప్పారని, అయితే అధికారంలోకి వచ్చాక గల్ఫ్‌ వలసలను అపలేకపోయారన్నారు.

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top