Disha Case: విచారణకు హాజరైన వీసీ సజ్జనార్

Disha Encounter: VC Sajjanar to Appear Before Sirpurkar Commission - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: దిశ నిందితుల ఎన్‌కౌంటర్‌ సమయంలో సైబరాబాద్‌ పోలీస్‌ కమిషనర్‌గా ఉన్న వీసీ సజ్జనార్‌ సోమవారం త్రిసభ్య కమిటీ (సిర్పుర్కర్‌ కమిషన్‌) ఎదుట హాజరయ్యారు. ఎన్‌కౌంటర్‌ ఘటనపై సజ్జనార్‌ స్టేట్‌మెంట్‌ను కమిషన్‌ నమోదు చేయనుంది. కాగా,​ ఇప్పటికే ఎన్‌కౌంటర్‌ బాధిత కుటుంబాలు, సిట్‌ చీఫ్‌ మహేష్‌ భగవత్‌, పలువురు సాక్ష్యుల వాంగ్ములాలు కమిషన్‌ నమోదు చేసింది. అయితే ఈ కేసులో సజ్జనార్‌ స్టేట్‌మెంట్‌ కీలకం కానుంది. 

చదవండి: (‘దిశ’ ఎన్‌కౌంటర్‌: నా కళ్లలో మట్టి పడింది)

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top