
సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఫొటో
కరీంనగర్: వేములవాడ ఆర్టీసీ డిపో మేనేజర్ మురళీకృష్ణ సంస్థకు చెందిన ఓ ఉద్యోగి ఇంట్లో విందు చేసుకున్న ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
దీంతో మద్యం తాగడం వ్యక్తి గతమైన విషయమైనప్పటికీ ఉద్యోగుల ఇళ్లలో ఇలా చేయడం ఇబ్బందికరమని పలువురు పోస్ట్ లు పెడుతున్నారు. దీనిపై డీఎంను వివరణ కోరగా గతేడాది జూలైలో ఉద్యోగి ఇంటికి తీజ్ ఉత్సవాలకు వెళ్లానని, ఎలాంటి మద్యం తీసుకోలేదని తెలిపారు. 10 నిమిషాలు మాత్రమే ఉండి వచ్చా నని, ఎవరో కావాలనే ఆరోపణలు చేస్తున్నారని పేర్కొన్నారు.