‘గిరిజన బంధు’ అమలు చేయండి | Chada Venkat Reddy Demands Girijana Bandhu | Sakshi
Sakshi News home page

‘గిరిజన బంధు’ అమలు చేయండి

Aug 2 2021 1:43 AM | Updated on Aug 2 2021 1:43 AM

Chada Venkat Reddy Demands Girijana Bandhu - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: దళిత బంధు పథకం మాదిరిగానే గిరిజన బంధు పథకం అమ లుకు వెంటనే చర్యలు తీసుకోవాలని సీఎం కేసీఆర్‌కు సీపీఐ కార్యదర్శి చాడ వెంకటరెడ్డి విజ్ఞప్తి చేశారు. రాష్ట్ర ప్రభుత్వం దళిత బంధు పథకాన్ని ప్రవేశపెట్టడం మంచిదేననీ, రాష్ట్ర వ్యాప్తంగా దళితులందరికీ పథకం అమలు చేయాలనేది తమ పార్టీ అభిప్రాయమన్నారు.

షెడ్యూల్‌ కులాలకు చెందిన వారి మాదిరిగానే గిరిజనులు కూడా వారి కాళ్లమీద వారు నిలబడటానికి గిరిజన బంధు పథకం దోహదపడుతుందని ఒక ప్రకటనలో పేర్కొన్నారు. రాష్ట్రంలో పోడు భూములను సాగుచేసుకుంటున్న ఆదివాసీ/గిరిజనులపై ఫారెస్టు అధికారులు, పోలీసులు కేసులు పెట్టడమే కాకుండా పంటలను పాడు చేయడాన్ని నియంత్రించాలన్నారు.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement