
కౌన్సెలింగ్ ఇచ్చి కోర్టులో ప్రవేశపెట్టిన పోలీసులు
కుత్బుల్లాపూర్: ప్రధాన చౌరస్తాల వద్ద భిక్షాటన చేసే వారితో పాటు హిజ్రాల ఆగడాలపై వచ్చిన కథనానికి పోలీసులు స్పందించారు. పేట్షిరాబాద్ సీఐ విజయవర్ధన్ సుచిత్ర చౌరస్తాలో ప్రతిరోజు ఉదయం నుంచి రాత్రి వరకు భిక్షాటన చేస్తూ వాహనదారులను ప్రజలను ఇబ్బందులకు గురి చేస్తున్న విషయాన్ని గుర్తించి సుమారు ఆరుగురిని అదుపులో తీసుకున్నారు. వారికి కౌన్సెలింగ్ ఇచ్చి కోర్టులో ప్రవేశపెట్టారు. న్యూసెన్స్ కేసు కింద ఫైన్ వేశారు. ఇక మీదట రోడ్లపై అడుక్కోరాదని తేల్చి చెప్పారు.