– వివరాలు 9లోu
– వివరాలు 8లోu
తమిళులు ఎవరికీ తలొగ్గరు
తమిళులు ద్రవిడ సిద్ధాంతానికి తప్పా,మరో సిద్ధాంతానికి తలొగ్గరని ఏఐసీసీ నేత రాహుల్ గాంఽధీ వ్యాఖ్యానించారు. ఎంతో బలమైన శక్తిగా ఉన్న అన్నాడీఎంకే నేత బానిసగా మారడండటం చూస్తుంటే బాధ కలుగుతోందన్నారు. తమిళనాడు ఎన్నికల ప్రచారంలో భాగంగా కన్యాకుమారి జిల్లాలో పర్యటించిన రాహుల్ గాంధీ, కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వంపై, తీవ్ర విమర్శలు గుప్పించారు.
వేలూరు కోట కోసం హోరాహోరీ
16వ శతాబ్దంలో విజయనగర సామ్రాజ్య పాలనలో బొమ్ము నాయకులు మైదాన ప్రాంతంలో నిర్మించిన వేలూరు కోట, నేటికీ భారతదేశంలోని అత్యుత్తమ కందకం కలిగిన కోటల్లో ఒకటిగా ఉంది. ఈ నగరంలో ప్రస్తుతం రాజకీయ సమరం అత్యంత ఆసక్తికరంగా సాగుతోంది.
తిరుత్తణి నియోజకవర్గంలో రాజకీయ పోరు రసవత్తరంగా సాగుతోంది. నియోజకవర్గంలోని పళ్లిపట్టు, తిరుత్తణి, తిరువలంగాడు మండలంలోని తిరుత్తణి నియోజకవర్గం పరిధిలోని ఏడు గ్రామ పంచాయతీల్లో తెలుగు వారు అధిక సంఖ్యలో నివశిస్తున్నారు. వీరు అభ్యర్థుల గెలుపులో కీలకం కానున్నారు.


