కోల్పోయినవారికే విలువ తెలుస్తుంది | - | Sakshi
Sakshi News home page

కోల్పోయినవారికే విలువ తెలుస్తుంది

Apr 18 2026 8:05 AM | Updated on Apr 18 2026 8:05 AM

తమిళసినిమా: జీవితంలో ప్రతి ఒక్కరికీ ప్రతి సంఘటన ఒక అనుభవమే. అలాంటి అనుభవాలు చాలా పాఠాలు నేర్పుతాయి. కోల్పోయిన వాటి విలువలను తెలియ జేస్తాయి. ఒక చిత్ర పరిశ్రమ విషయానికి వస్తే ఇక్కడ చాలా కథలు వెలుగు చూస్తాయి. అలాంటి పలు అనుభవాలను కలిగిన నటీమణుల్లో రెజీనా ఒకరు. అచ్చ తమిళ అమ్మాయి–2005 కండనాళ్‌ మొదల్‌ చిత్రం ద్వారా నటిగా పరిచయం అయ్యారు. తొలి చిత్రంతోనే మంచి గుర్తింపును పొందన ఈ భామ ఆ తరువాత తమిళంలో పాటు, తెలుగు, కన్నడం, హిందీ తదితర భాషల్లో నటిస్తూ తనకుంటూ ప్రత్యేక స్థానాన్ని సంపాందించుకున్నారు. ముఖ్యంగా తెలుగులో స్టార్‌ హీరోయిన్‌గా రాణిస్తున్నారు. అయితే కథానాయకిగానే కాకుండా నటనకు అవకాశం ఉంటే ప్రతినాయకిగానూ నటిస్తూ తన సత్తా చాటుతున్నారు. 35 ఏళ్ల ఈ భామ ఇప్పటికీ అవివాహితే. ఈమె ఇటీవల తన ఇన్‌స్టాలో ప్రేమ గురించి తెలిపారు. అందులో ‘నూతన రోజు, అయితే అదే రోజే నేను ప్రేమ కు సరెండర్‌ అయ్యాను. జరిగేది జరగడం అని భావించడాన్ని కొందరు బలహీనంగా భావిస్తున్నారు. అయితే ప్రేమ అనేది ఒక ప్రశాంతతో కూడిన బలం. ప్రతి రోజు మీ కోసం మీరు చిరునవ్వుతో లేచి నిలబడాలి. మీరు ప్రేమను అందించడానికి అర్హులు అనేది ఎప్పుడూ గుర్తుంచుకోండి. దాన్ని సాధారణంగా భావించరాదు. ప్రేమించడంలోనూ, ప్రేమించబడడంలోనూ ఉండే సంతోషం మనకు తెలియడానికి కారణం, దాన్ని కోల్పోవడంలోఉండే బాధ మనకు తెలుసు అన్నదే’ అని నటి రెజీనా పేర్కొన్నారు. ఈమె పోస్ట్‌కు కారణం ఏమిటి, స్వానుభవమా? అంటూ నెటిజన్లు సరదాగా కామెంట్స్‌ చేస్తున్నారు. ప్రస్తుతం నటి రెజీనా ఫ్లాష్‌బ్యాక్‌, మూక్కుత్తి అమ్మన్‌–2, ది వైవ్స్‌, హిందీలో సెక్షన్‌ 108 చిత్రాల్లో నటిస్తూ బిజీగా ఉన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement