కొరుక్కుపేట: కళారంజని చారిటబుల్ ట్రస్ట్, కళారంజిని స్కూల్ ఆఫ్ మ్యూజిక్ ఆధ్వర్యంలో 25వ వార్షిక తమిళ నూతన సంవత్సర , కళాకారుల పురస్కార ప్రదానోత్సవం అత్యంత వైభవంగా జరిగింది. వివిధ రంగాలలో విశేష సేవలను అందిస్తున్న ప్రముఖులకు ఈ సందర్భంగా పురస్కారాలను ప్రధానం చేశారు. కళారంజని చారిటబుల్ ట్రస్ట్ నిర్వాహకులు, సంగీత దర్శకులు డాక్టర్ జే. శ్రీనిబాబు పర్యవేక్షణలో ఈ కార్యక్రమం చైన్నె మొగప్పైర్లో ఉన్న వెంకటేశ్వర వెడ్డింగ్ హాల్లో ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ప్రత్యేక అతిథిగా కెవిజి ప్రాపర్టీస్ ప్రయివేటు లిమిటెడ్ మేనేజింగ్ డైరెక్టర్ కె.వి. గోపాలకృష్ణన్ విచ్చేశారు. ఈ సందర్భంగా సంగీతానికి విశేష కృషి చేస్తున్న ప్రముఖ సినీ నేపద్య గాయని ఎస్పీ శైలజాని ఇసై కలైవాణి పురస్కారంతో సత్కరించారు. అలాగే సమాజ సేవలో రాణిస్తున్న ఐకాస్ టెక్నాలజీస్ అధినేత ఎం . శోభా రాజా కి డైనమిక్ లేడీ పురస్కారం, ఇంకా చిన్మయ మిషన్కు చెందిన శ్రీ స్వామి సురేశానందకి భక్తి రత్న పురస్కారం, శివాజీ రవికి సేవా కళారత్న పురస్కారం, హెచ్.ఎన్. నందిని సురేష్ కి నాట్య కళైవాణి పురస్కారాలతో సత్కరించారు.


