ఘనంగా శివాలయాల్లో ప్రదోష పూజలు | - | Sakshi
Sakshi News home page

ఘనంగా శివాలయాల్లో ప్రదోష పూజలు

Nov 5 2025 7:57 AM | Updated on Nov 5 2025 7:57 AM

ఘనంగా శివాలయాల్లో ప్రదోష పూజలు

ఘనంగా శివాలయాల్లో ప్రదోష పూజలు

వేలూరు: వేలూరు, తిరువణ్ణామలై జిల్లాలోని ఆలయాల్లో తమిళ మాస ప్రదోష దినోత్సవాన్ని పురష్కరించుకొని సోమవారం ప్రదోష పూజలను నిర్వహించారు. ముందుగా తిరువణ్ణామలై అరుణాచలేశ్వరాలయంలోని అధికార పెద్ద నంది భగవాన్‌కు శివాచార్యులు వేద మంత్రాలతో మేళ తాళాల నడుమ ప్రత్యేక పూజలు, అభిషేకాలు, పుష్పాలంకరణలు చేశారు. అనంతరం భక్తుల అధిక సంఖ్యలో చేరుకొని హరోంహర నామస్మరణల మధ్య శివాచార్యులు వేదమంత్రాల నడుమ కర్పూర హారతులు పట్టారు. అనంతరం స్వామివార్లను అధికార నందివాహనంలో ఆశీనులు చేసి మాడ వీధుల్లో మేళ తాళాల నడుమ ఊరేగించారు. అదేవిధంగా వేలూరు కోట మైదానంలోని జలకంఠేశ్వరాలయంలో నందిభగవాన్‌కు శివాచార్యులు వేద మంత్రాల నడుమ ప్రత్యేక పూజలు, అభిషేకాలు చేసి కాయగూరలతో అలంకరించారు. అనంతరం నంది భగవాన్‌కు కర్పూర హారతులు ఇచ్చి మొక్కులు తీర్చుకున్నారు. అదేవిధంగా వేలూరు, తిరువణ్ణామలై, తిరుపత్తూరు, రాణిపేట వంటి జిల్లాల్లోని శివాలయాల్లోని నంది భగవాన్‌కు పూజలు చేసి ప్రార్థనలు జరిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement