
విద్యుత్ సబ్ స్టేషన్ పనుల తనిఖీ
తిరువళ్లూరు: అంబత్తూరు సమీప ప్రాంతాల్లో తరచూ ఏర్పడుతున్న లోఓల్టేజ్ సమస్యకు పరిస్కారం చూపాలనే ఉద్దేశంతో తిరువళ్లూరు జిల్లా కొరట్టూరు వద్ద సుమారు 501.72 కోట్లతో ఏర్పాటు చేసిన సబ్స్టేషన్ పనులు తుది దశకు చేరుకున్నాయి. ఈక్రమంలో దాన్ని త్వరలో ప్రారంబించి అందుబాటులోకి తెస్తామని అడిషనల్ చీఫ్ సెకరెట్రి, విద్యుత్ బోర్డు అధ్యక్షుడు డాక్టర్ రాధాకృష్ణన్ తెలిపారు. తమిళనాడు విద్యుత్ బోర్డు ఆద్వర్యంలో కొరట్టూరు వద్ద సుమారు 501.72 కోట్లు వ్యయంతో 400 కిలో మోగావాట్ సామరథ్యం వున్న విద్యుత్ సబ్స్టేషన్ను ఏర్పాటు చేశారు. ఈ సబ్స్టేషన్ పనులు పూర్తయిన క్రమంలో విద్యుత్ శాఖ డైరెక్టర్ ఇంద్రాణితో కలిసి డాక్టర్ రాధాకృష్ణన్ పరిశీలించారు. ట్రయల్రన్ను సమర్ధంగా నిర్వహించాలని సమస్యలు వుంటే తక్షణం వాటిని పరిష్కరించాలని ఈ సందర్భంగా సిబ్బందిని ఆదేశించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ పనులు పూర్తయిన క్రమంలో త్వరలోనే వాటిని ప్రారంభించి అందుబాటులోకి తెస్తామని వివరించారు. విద్యుత్ సబ్స్టేషన్ అందుబాటులోకి వస్తే లోఓల్టేజ్ సమస్యకు శాశ్వతంగా పరిష్కారం దొరుకుందన్నారు.