బాధితులకు భరోసా కల్పించాలి | - | Sakshi
Sakshi News home page

బాధితులకు భరోసా కల్పించాలి

Apr 15 2025 1:40 AM | Updated on Apr 15 2025 1:40 AM

బాధిత

బాధితులకు భరోసా కల్పించాలి

ఎస్పీ నరసింహ

సూర్యాపేట టౌన్‌ : ఫిర్యాదులపై పోలీస్‌ సిబ్బంది తక్షణమే స్పందించి బాధితులకు భరోసా కల్పించాలని ఎస్పీ నరసింహ సూచించారు. సోమవారం సూర్యాపేట జిల్లా పోలీస్‌ కార్యాలయంలో నిర్వహించిన పోలీసు ప్రజావాణి కార్యక్రమంలో ఫిర్యాదులను స్వీకరించి బాధితులతో మాట్లాడారు. ప్రతి ఫిర్యాదును పరిశీలించి సత్వరం చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.

సన్నబియ్యం పంపిణీ.. అద్భుత పథకం

హుజూర్‌నగర్‌ : కాంగ్రెస్‌ ప్రభుత్వం ప్రవేశ పెట్టిన సన్నబియ్యం పంపిణీ అద్భుత పథకమని రాష్ట్ర వికలాంగుల కార్పొరేషన్‌ చైర్మన్‌ ముత్తినేని వీరయ్య పేర్కొన్నారు. సోమవారం హుజూర్‌నగర్‌లోని గోవిందపురంలో దళితవాడకు చెందిన పాలడుగు కోటయ్య ఇంట్లో స్థానిక నాయకులతో కలిసి సహపంక్తి భోజనం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. ఈ పథకం వల్ల రాష్ట్రంలో ప్రస్తుతం కోటీశ్వరుడి నుంచి కూలీ వరకు సన్నబియ్యమే తింటున్నారని అన్నారు. ఉచిత సన్నబియ్యం పథకంతో దేశం మొత్తం తెలంగాణ వైపే చూస్తోందన్నారు. ఈ కార్యక్రమంలో పట్టణ కాంగ్రెస్‌ అధ్యక్షుడు తన్నీరు మల్లికార్జున్‌, ఐఎన్‌టీయూసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి యరగాని నాగన్న, జక్కుల మల్లయ్య, దొంతగాని శ్రీనివాస్‌, సుబ్బరాజు, సౌజన్య, ధనుంజయ్‌, జైలు, వీరబాబు, ముక్కంటి, కోటమ్మ, అజీజ్‌ పాషా, సత్యనారాయణ, రాములు, పున్నయ్య, సైదులు, కృష్ణ, అమర్‌నాధ్‌ రెడ్డి, ఉపేందర్‌, సావిత్రి తదితరులు పాల్గొన్నారు.

అగ్నిప్రమాదాలపై

అవగాహన కల్పించాలి

సూర్యాపేటటౌన్‌ : అగ్ని ప్రమాదాలపై అవగాహన కల్పించాలని అదనపు కలెక్టర్‌ రాంబాబు సూచించారు. సోమవారం సూర్యాపేట జిల్లా కేంద్రంలోని ఫైర్‌ స్టేషన్‌ లో అగ్నిమాపక వారోత్సవాల సందర్భంగా వాల్‌ పోస్టర్‌ను ఆవిష్కరించి మాట్లాడారు. శ్రీఅగ్ని ప్రమాదాల నివారణ పట్ల ప్రతి ఒక్కరికీ అవగాహన పెంచుదాం.. సురక్షిత భారతాన్ని నిర్మిద్దాంశ్రీ అనే నినాదంతో ఈనెల 14 నుంచి 20 వరకు వారం రోజుల పాటు జన సమూహం ఉండే ప్రాంతాల్లో అగ్ని ప్రమాద నివారణ పద్ధతులపై ప్రజలకు అవగాహన కల్పించే కార్యక్రమాలు విజయవంతం చేయాలన్నారు. అనంతరం విధి నిర్వహణలో ప్రాణాలు కోల్పోయిన అగ్నిమాపక సిబ్బందికి నివాళులర్పించి, రెండు నిమిషాల పాటు మౌనం పాటించారు. ఇదే శాఖకు చెందిన రిటైర్డ్‌ ఉద్యోగులను సన్మానించారు. ఈ కార్యక్రమంలో జిల్లా అగ్నిమాపక అధికారి కృష్ణారెడ్డి, జానయ్య పాల్గొన్నారు.

మహాసభలను

జయప్రదం చేయాలి

హుజూర్‌నగర్‌ (చింతలపాలెం) : భవన నిర్మాణ కార్మిక సంఘం జిల్లా నాలుగో మహాసభలను జయప్రదం చేయాలని ఏఐటీయూసీ రాష్ట్ర కార్యదర్శి మేకల శ్రీనివాసరావు, జిల్లా అధ్యక్షులు జడ శ్రీనివాస్‌ పిలుపునిచ్చారు. సోమవారం చింతలపాలెం మండలం దొండపాడులో మహాసభల ఏర్పాట్లను పరిశీలించి మాట్లాడారు. మంగళవారం 10 గంటలకు ప్రారంభమయ్యే మహా సభలకు సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మారగాని ప్రవీణ్‌ కుమార్‌ హాజరవుతారన్నారు. కార్యక్రమంలో మారుడి శ్రీనివాస రెడ్డి, చెల్లా బాలశౌరి, బండారు బాలరాజు, ఓర్సు ప్రసాద్‌, తమ్మిశెట్టి సాగర్‌, ఆదిమల్ల సైదులు, వీరబాబు, కల్పన పాల్గొన్నారు.

బాధితులకు  భరోసా కల్పించాలి1
1/2

బాధితులకు భరోసా కల్పించాలి

బాధితులకు  భరోసా కల్పించాలి2
2/2

బాధితులకు భరోసా కల్పించాలి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement