యాదగిరీశుడిని దర్శించుకున్న గంగోత్రి కాళికా పీఠాధిపతి | - | Sakshi
Sakshi News home page

యాదగిరీశుడిని దర్శించుకున్న గంగోత్రి కాళికా పీఠాధిపతి

Jan 15 2026 8:25 AM | Updated on Jan 15 2026 8:25 AM

యాదగిరీశుడిని దర్శించుకున్న గంగోత్రి కాళికా పీఠాధిపతి

యాదగిరీశుడిని దర్శించుకున్న గంగోత్రి కాళికా పీఠాధిపతి

యాదగిరిగుట్ట : యాదగిరి లక్ష్మీనరసింహస్వామిని గంగోత్రి కాళికా పీఠాధిపతి నారాయణ తీర్థ్‌ స్వామిగల్‌ గంగోత్రి శంకరాచార్యులు బుధవారం సందర్శించారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు ఆయనకు సంప్రదాయంగా స్వాగతం పలికారు. శంకరాచార్యులు గర్భాలయంలోని స్వయంభూ, ప్రతిష్ఠా అలంకారమూర్తులను దర్శించుకొని ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం ముఖ మండపంలోని సువర్ణ పుష్పార్చనమూర్తులను దర్శించుకుని, అష్టోత్తర పూజల్లో పాల్గొన్నారు. ఆ తర్వాత ఆయన ప్రవచనం చేయగా, అర్చకులు వేద మంత్రాలతో ఆశీర్వచనం చేశారు.

భువనగిరిలో ఎంఎంటీఎస్‌

రైల్వే ట్రాక్‌ పనులు ముమ్మరం

భువనగిరిటౌన్‌ : భువనగిరి మున్సిపాలిటీ పరిధిలోని మాస్‌కుంట వద్ద ఎంఎంటీఎస్‌ రైల్వే ట్రాక్‌ నిర్మాణ పనులు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. రైల్వే ట్రాక్‌ పక్క నుంచి ఈ పనులు చేపట్టారు. ఎంఎంటీఎస్‌ రైల్‌ను ఘట్‌కేసర్‌ నుంచి వంగపల్లి వరకు విస్తరిస్తున్నారు. రూ. 412 కోట్లతో సుమారు 41 కిలో మీటర్ల మేర విస్తరించడానికి చేపట్టిన పనులు చకచకాసాగుతున్నాయి. 2028 నాటికి పనులు పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement