తాము అధికారంలోకి వస్తే రహదారులను అద్దాల్లా మెరిపిస్తామని కూటమి నాయకులు గొప్పలు
పలికారు. అధికారంలోకి వచ్చాక ఆ సంగతే మరిచిపోయారు. అందుకు ప్రత్యక్ష ఉదాహరణే కొత్తూరు మండలం నివగాంలోని పట్నాల వీధి వద్ద రహదారి. నిత్యం రద్దీగా ఉండే ఈ రోడ్డులో భారీ గోతులు ఏర్పడ్డాయి. ఇటీవల కురిసిన వర్షాలకు నీరు చేరిపోయి చెరువును తలపిస్తోంది. దీంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ముఖ్యంగా రాత్రివేళల్లో తరచూ ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి. – కొత్తూరు


