శ్రీకాకుళం అర్బన్: బకాయి పడ్డ డీఏను తక్షణమే చెల్లించాలని కోరుతూ దేశవ్యాప్త నిరసన కార్యక్రమంలో భాగంగా సోమవారం శ్రీకాకుళంలోని సంచార్ భవన్ వద్ద బీఎస్ఎన్ఎల్ ఉద్యోగులు భోజన విరామ సమయంలో నిరసన ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా యూనియన్ ప్రతినిధులు మాట్లాడుతూ జనవరి నుంచి 3 విడతల డీఏ అరియర్స్ను తక్షణమే చెల్లించాలన్నారు. దీనిపై కోర్టు స్పష్టమైన తీర్పు ఇచ్చినా పక్కన పెట్టేయడం శోచనీయమన్నారు. కార్యక్రమంలో యూనియన్ నాయకులు పోలాకి వెంకటరావు, మాతల గోవర్ధన్రావు, ఎస్.అభిమన్యు, బీహెచ్.లక్ష్మి, సూర్యనారాయణ, హెచ్. లక్ష్మి, వై.లక్ష్మి, వి.శివనాయుడు, జి.మహేష్బాబు తదితరులు పాల్గొన్నారు.


