అలరించిన సంగీత విభావరి
ప్రశాంతినిలయం: సత్యసాయిని స్మరిస్తూ నిర్వహించిన సంగీత విభావరి భక్తులను మంత్ర ముగ్దులను చేసింది. బుధవారం సాయంత్రం సాయికుల్వంత్ సభా మందిరంలో ప్రశాంతి నిలయం బృందావన్, నందగిరి క్యాంపస్ విద్యార్థులు సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు.
నేడు సంక్రాంతి వేడుకలు
సత్యసాయి సన్నిధిలో సంక్రాంతి వేడుకలు గురువారం ఘనంగా నిర్వహించనున్నారు. ఇప్పటికే సత్యసాయి మహా సమాధిని ప్రత్యేకంగా అలంకరించారు. వివిధ ప్రాంతాలకు చెందిన భక్తులు వేడుకల్లో పాల్గొనేందుకు ప్రశాంతి నిలయం చేరుకున్నారు. ఇటీవల నిర్వహించిన సత్యసాయి క్రీడా సాంస్కృతిక సమ్మేళనంలో ప్రతిభ చూపిన విద్యార్థులకు సంక్రాంతి వేడుకల్లో భాగంగా బహుమతులు ప్రదానం చేయనున్నారు.
అలరించిన సంగీత విభావరి


