
చెరువులు నిండితేనే పంటలు
చిలమత్తూరు మండలం దేమకేతేపల్లి పంచాయతీలో కొర్లకుంట, దేమకేతేపల్లి చెరువులకు హంద్రీ–నీవా నీరు వదులుతారు. ప్రస్తుతం కొండూరు చెరువుకు నీళ్లు వదిలారని, అయితే అవి సరిగా రావడం లేదని అంటున్నారు. అదే నిండకపోతే ఇక మా చెరువులకు నీళ్లు ఎలా వస్తాయి? బోరుబావుల్లో నీరు తగ్గిపోయే పరిస్థితులు ఉన్నాయి. చెరువులు నిండితేనే పెట్టిన పంటలు చేతికొస్తాయి. నీళ్లు త్వరగా వదలాలి. అధికారులు, పాలకులు స్పందించాలి.
– చంద్రశేఖర్రెడ్డి, రైతు, డి.గొల్లపల్లి