భార్య హత్య కేసులో భర్త అరెస్ట్‌ | - | Sakshi
Sakshi News home page

భార్య హత్య కేసులో భర్త అరెస్ట్‌

Jun 18 2025 3:31 AM | Updated on Jun 18 2025 3:31 AM

భార్య హత్య కేసులో భర్త అరెస్ట్‌

భార్య హత్య కేసులో భర్త అరెస్ట్‌

నెల్లూరు(క్రైమ్‌): భార్యను హత్య చేసిన భర్తను పోలీసులు అరెస్ట్‌చేశారు. మంగళవారం నెల్లూరు బాలాజీనగర్‌ పోలీస్‌స్టేషన్‌లో స్థానిక ఇన్‌స్పెక్టర్‌ కె.సాంబశివరావు హత్యకు దారితీసిన పరిస్థితులను వెల్లడించారు. బాలాజీనగర్‌ వైకే ఆచారి స్కూల్‌ వీధిలో ఎల్‌.విజయచంద్ర, శైలజ (46) దంపతులు నివాసం ఉంటున్నారు. వారికి ఇద్దరు కుమారులు సంతానం. విజయచంద్ర ట్రెజరీ కార్యాలయంలో సీనియర్‌ అసిస్టెంట్‌గా పనిచేస్తున్నాడు. శైలజ తండ్రి ఆస్తి కోసం చైన్నె కోర్టులో కేసు వేసి ఓడిపోయింది. కేసుకు సంబంధించి ఆమె భర్తచే రూ.40 లక్షలకు పైగా అప్పు చేయించింది. దీని కారణంగా విజయచంద్ర పిల్లల ఫీజులు సైతం కట్టలేకపోయాడు. ఈ క్రమంలోనే శైలజ భర్తపై అనుమానం పెంచుకుని వేధించసాగింది. విధులకు వెళ్లినా వీడియో కాల్స్‌ చేస్తుండేది. వేధింపులు తాళలేని విజయచంద్ర భార్యను ఎలాగైనా అంతమొందించాలని నిర్ణయించుకున్నాడు. ఈనెల 14వ తేదీన అతను కుమారులను భోజనం తీసుకురావాలని ఇంటి నుంచి బయటకు పంపాడు. పథకం ప్రకారం భార్య గొంతుకు టవల్‌ బిగించి చంపేందుకు యత్నించాడు. ఆమె చావకపోవడంతో రోకలిబండతో బలంగా తలపై కొట్టాడు. ఆమె మృతిచెందిందని నిర్ధారించుకున్న అనంతరం విజయచంద్ర పరారయ్యాడు. మృతురాలి పెద్దకుమారుడు ఎల్‌.శ్యామ్‌సాత్విక్‌ ఫిర్యాదు మేరకు బాలాజీనగర్‌ పోలీసులు కేసు నమోదు చేశారు. పరారీలో ఉన్న నిందితుడిని ఇన్‌స్పెక్టర్‌ సోమవారం అరెస్ట్‌ చేశారు. కేసు ఛేదనలో ప్రతిభ చూపిన సిబ్బందిని ఎస్పీ అభినందించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement