కాకాణి బెయిల్‌ పిటిషన్‌పై విచారణ రేపు | - | Sakshi
Sakshi News home page

కాకాణి బెయిల్‌ పిటిషన్‌పై విచారణ రేపు

Jun 17 2025 4:59 AM | Updated on Jun 17 2025 4:59 AM

కాకాణ

కాకాణి బెయిల్‌ పిటిషన్‌పై విచారణ రేపు

నెల్లూరు(లీగల్‌): మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్‌రెడ్డి బెయిల్‌ పిటిషన్‌ విచారణను బుధవారానికి వాయిదా వేస్తూ నెల్లూరు ఐదో అదనపు జిల్లా జడ్జి (ప్రత్యేక ఎస్సీ ఎస్టీ) కోర్టు న్యాయమూర్తి సరస్వతి సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు. గోవర్ధన్‌రెడ్డి బెయిల్‌ పిటిషన్‌పై పోలీసుల తరఫున స్పెషల్‌ పీపీ వాదనలు వినిపించాల్సి ఉంది. కాగా పీపీ అత్త మృతిచెందగా వాదనలను మరోరోజుకు వాయిదా వేయాలని కోరుతూ కేసులోని దర్యాప్తు అధికారి కోర్టులో మెమో దాఖలు చేశారు. దీంతో న్యాయమూర్తి బెయిల్‌ పిటిషన్‌పై వాదనల కొనసాగింపును బుధవారానికి వాయిదా వేశారు.

● గోవర్ధన్‌రెడ్డిపై ముత్తుకూరు పోలీసులు నమోదు చేసిన అక్రమ కేసులో దాఖలు చేసిన యాంటిసిపేటరీ బెయిల్‌ పిటిషన్‌ విచారణను ఈనెల 19వ తేదీకి వేయిదా వేస్తూ నెల్లూరు ప్రిన్సిపల్‌ డిస్ట్రిక్ట్‌ – సెషన్స్‌ కోర్టు న్యాయమూర్తి జి. శ్రీనివాస్‌ సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు. కాగా వెంకటాచలం పోలీసులు నమోదు చేసిన అక్రమ కేసులో కాకాణి దాఖలు చేసిన యాంటిసిపేటరీ బెయిల్‌ పిటిషన్‌ విచారణను ఈనెల 19కు వాయిదా వేస్తూ నెల్లూరు నాలుగో అదనపు జిల్లా కోర్టు న్యాయమూర్తి కె.శ్రీనివాసరావు ఉత్తర్వులిచ్చారు.

కలెక్టర్‌ను కలిసిన

ఐఏఎస్‌ అధికారులు

నెల్లూరు(అర్బన్‌): శిక్షణలో భాగంగా ఏపీ దర్శన్‌ కింద ఏడుగురు ఐఏఎస్‌ అధికారులు సోమవారం నెల్లూరుకు వచ్చారు. వీరు కలెక్టర్‌ ఆనంద్‌, జేసీ కార్తీక్‌ను కలెక్టరేట్‌లో కలిశారు. జిల్లాలో అమలు చేస్తున్న వివిధ సంక్షేమ పథకాల గురించి ఆనంద్‌ వివరించారు. వీరికి ఉదయగిరి ఉడెన్‌తో చేసిన వస్తువులను బహూకరించారు. యువ ఐఏఎస్‌లు కృష్ణపట్నం పోర్టును సందర్శించారు. డీఆర్‌డీఏ పీడీ నాగరాజకుమారి పాల్గొన్నారు.

చికెన్‌ వ్యర్థాల పట్టివేత

టీడీపీ, జనసేన నేతల మధ్య వాగ్వాదం

ఆత్మకూరు రూరల్‌: మండలంలోని వాశిలి చెరువుకట్టపై చికెన్‌ వ్యర్థాలను జనసేన నియోజకవర్గ ఇన్‌చార్జి నలిశెట్టి శ్రీధర్‌ ఆధ్వర్యంలో సోమవారం ఆ పార్టీ నాయకులు పట్టుకుని అధికారులకు ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా జనసేన నేతలు బండి అనిల్‌ రాయల్‌, డబ్బుకొట్టు నాగరాజు యాదవ్‌ తదితరులు మాట్లాడుతూ ఆత్మకూరు నియోజకవర్గ వ్యాప్తంగా చేపల పెంపకం చేసే చెరువుల్లో కర్ణాటక నుంచి వచ్చే చికెన్‌ వ్యర్థాలు వాడుతున్నారన్నారు. స్థానికంగా ఉన్న రాజకీయ నేతల ప్రోద్బలంతో ఈ తంతు జరుగుతున్నట్లు తెలిపారు. ఈ విషయమై ఆత్మకూరు ఆర్డీఓ భూమిరెడ్డి పావని, డీఎస్పీ వేణుగోపాల్‌కు ఫిర్యాదు చేశామన్నారు. వాశిలి గ్రామంతోపాటు పరిసర గ్రామాల్లో ఉన్న టీడీపీ, కూటమి నాయకుల ప్రమేయంతో ఈ వ్యాపారం జోరుగా సాగుతున్నట్లు ప్రచారం జరుగుతోంది. చికెన్‌ వ్యర్థాల రవాణాకు అండగా ఉన్న టీడీపీ నాయకులు ఘటనా స్థలానికి చేరుకుని జనసేన నేతలతో వాగ్వాదానికి దిగారు. రెండు వాహనాలను పట్టించడంపై మండిపడ్డారు. ఈ వ్యవహారం చర్చనీయాంశంగా మారింది.

విద్యార్థులే పనివాళ్లు

పుస్తకాలు మోస్తున్న వైనం

ఆత్మకూరు: విద్యార్థులను కూలీలుగా మార్చేసిన వైనమిది. మండల కేంద్రమైన అనుమసముద్రంపేట మెయిన్‌ పాఠశాలకు ఎంఈఓ నేతృత్వంలో పాఠ్యపుస్తకాలు వారంరోజుల క్రితం చేరాయి. తొలి రెండురోజులు పుస్తకాలను కొన్ని బడులకు ఎంఈఓ–2 నేతృత్వంలో సరఫరా చేశారు. ఇంకా మరికొన్నిచోట్లకు పుస్తకాలను సరఫరా చేసేందుకు సోమవారం గ్రామాల్లోని స్కూళ్ల ఉపాధ్యాయులు మండల కేంద్రానికి చేరుకున్నారు. విద్యార్థులచే పుస్తకాలను మోటార్‌బైక్‌ వరకు మోయించారు. దీనిని చూసిన పలువురు విస్మయం వ్యక్తం చేశారు. ఈ విషయమై డిప్యూటీ డీఈఓ ఎన్‌వీ జానకీరామ్‌ను సంప్రదించగా తనకు ఇప్పుడే సమాచారం తెలిసిందని, విచారణ చేసి చర్యలు తీసుకుంటామన్నారు.

కాకాణి బెయిల్‌ పిటిషన్‌పై విచారణ రేపు1
1/2

కాకాణి బెయిల్‌ పిటిషన్‌పై విచారణ రేపు

కాకాణి బెయిల్‌ పిటిషన్‌పై విచారణ రేపు2
2/2

కాకాణి బెయిల్‌ పిటిషన్‌పై విచారణ రేపు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement