కాళ్లరిగేలా తిరుగుతున్నాం..కనికరించండి | - | Sakshi
Sakshi News home page

కాళ్లరిగేలా తిరుగుతున్నాం..కనికరించండి

Jun 17 2025 4:59 AM | Updated on Jun 17 2025 4:59 AM

కాళ్ల

కాళ్లరిగేలా తిరుగుతున్నాం..కనికరించండి

తల్లికి వందనం పథకం కోసం..

కార్పొరేషన్‌తోపాటు అన్ని మున్సిపాలిటీల్లో పనిచేస్తున్న 2,500 మంది పారిశుధ్య, ఇంజినీరింగ్‌, ఏఎంఆర్‌ కార్మికులకు తల్లికి వందనం పథకం వర్తింపజేయాలి. వీరంతా వివిధ సొసైటీలు, ఆఫ్కాస్‌ కింద కాంట్రాక్ట్‌, ఎన్‌ఎంఆర్‌ పద్ధతిలో అతి తక్కువ వేతనంతో పని చేస్తున్నారు. ఎలాంటి ప్రభుత్వ పథకాలు వర్తింపజేయకపోవడం దారుణం. అలాగే 8 నెలలుగా పారిశుధ్య కార్మికులకు చెల్లిస్తున్న విధంగానే ఇంజినీరింగ్‌ కార్మి కులకు జీఓ నంబర్‌ 36 ప్రకారం రూ.21 వేల నుంచి రూ.24 వేల వరకు జీతం చెల్లించాలి. తల్లికి వందనంతోపాటు అన్ని రకాల సంక్షేమ పథకాలు వర్తింపజేయాలి.

– నాగేశ్వరరావు, కొండా ప్రసాద్‌,

పెంచలనరసయ్య, శ్రీనివాసులు, సీఐటీయూ నాయకులు, నెల్లూరు

అర్జీదారులతో కలెక్టరేట్‌ కిటకిట

నెల్లూరు(అర్బన్‌): సమస్యల పరిష్కారం కోసం మండల స్థాయిలో అధికారులు తిప్పుకొంటున్నారు. కాళ్లరిగేలా తిరుగుతున్నా కనికరించడం లేదు. నెల్లూరు కలెక్టరేట్‌కు వస్తే మళ్లీ మండలాధికారుల వద్దకే పంపుతున్నారు. వారు మళ్లీ మళ్లీ తిప్పుకొంటున్నారు. మీరైనా దయచూపి సమస్యలను తీర్చాలని బాధితులు కోరారు. సోమవారం కలెక్టరేట్‌లో ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం జరిగింది. దీనికి జిల్లాలోని నలుమూలల నుంచి ప్రజలు వచ్చారు. కలెక్టర్‌ ఆనంద్‌, జేసీ కార్తీక్‌, డీఆర్వో ఉదయభాస్కర్‌రావు, డీపీఓ శ్రీధర్‌రెడ్డి, జిల్లా సర్వే అధికారి నాగశేఖర్‌ తదితరులు అర్జీలు స్వీకరించారు. 398 మంది ఆన్‌లైన్‌ అర్జీలను, మరో 40 మంది ఆఫ్‌లైన్‌లో సమర్పించారు. కలెక్టర్‌ అధికారులతో మాట్లాడుతూ నిర్ణీత గడువులోగా అర్జీదారుల సమస్యలను పరిష్కరించాలని ఆదేశించారు.

కాళ్లరిగేలా తిరుగుతున్నాం..కనికరించండి 1
1/1

కాళ్లరిగేలా తిరుగుతున్నాం..కనికరించండి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement