
విద్యార్థులను ఒత్తిడికి గురి చేస్తున్నారు
జిల్లాలో మాంటిస్సోరి, శాటిలైట్ ఫౌండేషన్ల పేరుతోనో.. మరొక పేరుతోనో ఎల్కేజీ, యూకేజీ లాంటి ప్రీ ప్రైమరీ పాఠశాలలు 500 వరకు ఉన్నాయి. వాటిలో కేవలం ఏడు మాత్రమే విద్యాశాఖ గుర్తింపు పొందాయి. మిగతావాటిని గుర్తింపు లేకుండా అక్రమంగా నడుపుతున్నారు. విద్యార్థుల నుంచి వేలాది రూపాయలు ఫీజుల రూపంలో వసూలు చేస్తున్నారు. అదనపు గంటలతో పాఠశాలలు నిర్వహిస్తున్నారు. సమాచార హక్కు చట్టంతో ఆధారాలు తీసుకుని సమర్పిస్తున్నాం. పిల్లలను శారీరకంగా, మానసికంగా ఒత్తిడికి గురి చేస్తున్నారు. దీనిపై చర్యలు చేపట్టాలి.
– శిఖరం నరహరి, కోట శ్రీనివాసులురెడ్డి, రాజశేఖర్ యాదవ్, శ్రీనివాసరావు, పేరెంట్స్ అసోసియేషన్