
పొలాన్ని ఆక్రమించాలని చూస్తున్నారు
మానాన్న కాలం నాటి నుంచి గ్రామంలోని ప్రభుత్వ శివాయి భూమి 2.50 ఎకరాలు మా సాగుబడిలో ఉంది. అప్పట్లోనే భూమి చదును, బాగు కోసం రూ.50 వేలు, మోటార్కు, బోరుబావికి మరో రూ.లక్ష ఖర్చు చేశాం. 30 ఏళ్ల నుంచి ఉలవలు, జామాయిల్ లాంటి పంటలు పండించాం. 17 ఏళ్ల నుంచి మామిడి తోట వేశాం. ప్రభుత్వ రీసర్వేలో సైతం సాగుబడి కింద మా పేర్లు నమోదు చేశారు. ఇటీవల వెలిచర్ల అంకమ్మ, వారి కుటుంబ సభ్యులు ఆ భూములు తమవంటూ దౌర్జన్యం చేస్తున్నారు. దీంతో తమ భూములను 10 – 1 అడంగళ్లో ఎక్కించి పట్టాదారు పాస్పుస్తకాలు ఇప్పించాలని కలెక్టరేట్లో సంవత్సరం క్రితం అర్జీ ఇచ్చాను. కలెక్టర్ ఆ అర్జీని ఆర్డీఓకు పంపారు. ఆయన తిప్పుకొన్నారు. ఇప్పుడు బదిలీ అయ్యారు. నా భూమికి పాస్ పుస్తకాలు ఇప్పించాలంటూ ఇప్పటికే మూడు దఫాలు కలెక్టరేట్కు వచ్చి అర్జీలిచ్చాం. సమస్యకు పరిష్కారం చూపాలి.
– చీదర్ల మాల్యాద్రి, లక్ష్మీకాంతమ్మ, కేశవరం గ్రామం, జలదంకి మండలం