మామిడికి పురుగుపోటు | - | Sakshi
Sakshi News home page

మామిడికి పురుగుపోటు

Jun 16 2025 7:05 AM | Updated on Jun 16 2025 7:05 AM

మామిడ

మామిడికి పురుగుపోటు

కవర్‌ కడితే..

ఉలవపాడు: ఫలరాజుకు పురుగు పట్టింది. దీంతో ఎంతో ఇష్టంగా తినే ఉలవపాడు మామిడి ప్రస్తుతం ప్రజలకు చేదైంది. కోతకు వచ్చే సమయంలో వర్షాలు కురవడంతో కాయల్లో పురుగులు వచ్చాయి. గతంలోనూ పండుఈగ తాకిడి ఉండగా అది కేవలం 5 శాతంలోపే. అయితే వానల వల్ల కాయల్లో నేడు పురుగులు వస్తున్నాయి. ప్రస్తుతం సుమారు 30 శాతం తోటల్లో ఈ పరిస్థితి ఉందని రైతులు అంటున్నారు.

ఇబ్బందికరంగా..

ప్రపంచ వ్యాప్తంగా పేరొందిన ఉలవపాడు మామిడి రుచిలో అద్భుతమని జనం చెబుతారు. చాలామంది తమ మిత్రులకు, బంధువులకు, అధికారులకు బాక్స్‌ల్లో కాయలు పంపిస్తుంటారు. ప్రస్తుతం వాటిలో పురుగులున్నాయని చెబుతుండటంతో ఆందోళన చెందుతున్నారు. ఉలవపాడు ఉద్యాన శాఖ పరిధిలో సుమారు 10 వేల ఎకరాల్లో మామిడి సాగు జరుగుతోంది. వాతావరణ పరిస్థితులు అనుకూలంగా లేని కారణంగా ఈ ఏడాది దిగుబడి తగ్గింది. తొలుత కాయల రేట్లు అధికంగా ఉన్నాయి. తర్వాత పురుగుల తాకిడి వల్ల కాస్త తగ్గాయి. ప్రస్తుతం టన్ను రూ.40 వేలు పలుకుతోంది. కానీ స్థానిక మార్కెట్లో మాత్రం కేజీ రూ.80 ఉంది. ప్రధానంగా ఇసుక నేలల్లో ఉన్న తోటలకు అధికంగా పురుగు వ్యాపించింది. ఎర్రనేలల్లో తక్కువగా ఉంది. పురుగులు తగలని తోటల్లో రేట్లు భారీగా ఉన్నాయి. పెద్ద తోటల్లో వేర్వేరు చెట్లలోని కాయలను పరిశీలిస్తున్నారు. పురుగు పట్టిందా? లేదా? అని పరిశీలించి అప్పుడు కొనుగోలు చేస్తున్నారు. ఒకవేళ పురుగు లేకపోతే అధిక రేటుకు కొంటున్నారు. పురుగు తగలని కొంత భాగం ఎర్రనేల కాయలను కొనుగోలుదారులు కేజీ రూ.100 పైనే తీసుకుంటున్నారు.

ఉలవపాడు మామిడికి ఎంతో పేరుంది. దీనిని ఇష్టంగా తినేవారు ఎందరో ఉన్నారు. స్థానికంగా ఉండే వారు బంధుమిత్రులకు పంపుతుంటారు. అయితే పురుగుల వల్ల ప్రస్తుతం కాయలపై అయిష్టత ఏర్పడుతోందని ప్రజలు

వాపోతున్నారు.

ఉలవపాడు ఫలరాజుకు

పండుఈగ కష్టాలు

వర్షాల వల్లే ఈ పరిస్థితి

30 శాతం తోటల్లో అంతే..

పురుగుల నివారణ కోసం కవర్‌ కట్టిన కాయలకు ప్రస్తుతం డిమాండ్‌ ఉంది. రైతులు చాలా తోటల్లో కట్టారు. ఈ కాయలు నాణ్యతగా ఉంటాయి. అయితే ఎండ, వడగాలి తగలదు కాబట్టి రుచి కాస్త తక్కువగా ఉంటుంది. ఈ కాయలకు డిమాండ్‌ అధికంగా ఉన్నా అందరూ కొనుగోలు చేయడం లేదు. రుచి కోరుకునే వారు ఎండ తగిలే కాయలనే తీసుకుంటున్నారు. కానీ పురుగులు తగలకుండా నాణ్యమైన కాయలను కావాలనుకునే వారు మాత్రం ఈ కవర్‌ కట్టిన వాటిని కోరుకుంటున్నారు. ప్రస్తుతం ఈ ప్రాంత కాయలకు పురుగులు రావడంతో కవర్‌ కట్టిన కాయలకు కాస్త డిమాండ్‌ ఉంది. కేజీ రూ.100 పైనే అమ్ముతున్నారు. టన్ను రూ.60 వేలకు ఎగుమతులు చేస్తున్నారు.

మామిడికి పురుగుపోటు1
1/3

మామిడికి పురుగుపోటు

మామిడికి పురుగుపోటు2
2/3

మామిడికి పురుగుపోటు

మామిడికి పురుగుపోటు3
3/3

మామిడికి పురుగుపోటు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement