
మోటార్బైక్ దగ్ధం
కలువాయి(సైదాపురం): మండల కేంద్రమైన కలువాయి బస్టాండ్ సెంటర్లో సీఎస్సీ సెంటర్ నిర్వహిస్తున్న కరిముల్లా అనే వ్యక్తి మోటార్బైక్ ఆదివారం దగ్ధమైంది. వాహనం నుంచి ఒక్కసారిగా మంటలు రావడంతో గమనించిన స్థానికులు ఆర్పేందుకు యత్నించారు. అయితే అప్పటికే బైక్ కాలిపోయింది.
ఆదివారం కదా..
అందుకే రాలేదు!
ఉదయగిరి: ఉదయగిరి మండలం గండిపాళెంలో ఉన్న ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఆదివారం ఒక్క స్టాఫ్ నర్సు మినహా మిగతా సిబ్బంది ఎవరూ లేరు. ఈ పీహెచ్సీలో ఇద్దరు వైద్యాధికారులు ఉండగా ఒక్కరు కూడా విధులకు హాజరుకాలేదు. ల్యాబ్ టెక్నీషియన్ది కూడా ఇదే పరిస్థితి. దీంతో మెడికల్ ఆఫీసర్, ల్యాబ్ గదుల తలుపులు తెరుచుకోలేదు. ఒక్క స్టాఫ్నర్సు మాత్రమే విధుల్లో ఉండి వచ్చిన రోగులకు మందులిచ్చి పంపించారు. ఆదివారం వచ్చిందంటే గండిపాళెం పీహెచ్సీకి సెలవే. ఇది 24 గంటలు పనిచేయాల్సిన ఆస్పత్రి. అయితే ఆరోజు వైద్యులు, ఆరోగ్య సిబ్బంది అందుబాటులో ఉండరు. దీంతో పలువురు రోగులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దీనిపై ఉన్నతాధికారులు స్పందించాలని కోరుతున్నారు.
కసుమూరు దర్గాలో నటుడు అలీ ప్రార్థనలు
వెంకటాచలం: సినీ నటుడు అలీ తన కుటుంబ సభ్యులతో కలిసి ఆదివారం కసుమూరు దర్గాను సందర్శించారు. ఈ సందర్భంగా దర్గా ముజావర్లు ఘన స్వాగతం పలికారు. అలీ కుటుంబం ప్రత్యేక ప్రార్థనలు చేసింది.
జాతీయ స్థాయి కబడ్డీ పోటీలకు ఎంపిక
గూడూరు రూరల్: గూడూరు పట్టణంలోని జిల్లా పరిషత్ బాలికల ఉన్నత పాఠశాల విద్యార్థులు దీపిక, కౌసల్య జాతీయ స్థాయి కబడ్డీ పోటీలకు ఎంపికై నట్లు ప్రధానోపాధ్యాయురాలు మాధవీలక్ష్మి తెలిపారు. ఆదివారం వివరాలు వెల్లడించారు. బాలికలు కాకినాడలో ఈనెల 12 నుంచి 15వ తేదీ వరకు జరిగిన కబడ్డీ ఫెడరేషన్ చాంపియన్షిప్లో ప్రతిభ చూపి జాతీయ స్థాయికి ఎంపికై నట్టు పేర్కొన్నారు. వీరు రాజస్థాన్లో జూలై 10 నుంచి 13వ తేదీ వరకు జరిగే పోటీల్లో పాల్గొంటారన్నారు. ఆమె, పీడీ విజయలక్ష్మి, విద్యార్థినులను అభినందించారు.
వేర్వేరు ప్రమాదాల్లో
ఆరుగురికి గాయాలు
పెళ్లకూరు: మండలంలో ఆదివారం జరిగిన రెండు వేర్వేరు రోడ్డు ప్రమాదాల్లో ఆరుగురు స్వల్పంగా గాయపడ్డారు. స్థానికుల కథనం మేరకు.. విజయవాడకు చెందిన మధుసూదన్రెడ్డి, కుటుంబ సభ్యులు తిరుమల శ్రీవారి దర్శనానికి వెళ్లారు. ఆదివారం తిరుగు ప్రయాణమయ్యారు. పెళ్లకూరు మండలం పెన్నేపల్లి వద్ద కారు అదుపుతప్పి ఐరన్ డివైడర్ను ఢీకొంది. కారులో ప్రయాణిస్తున్న తొమ్మిది మందిలో ఐదుగురికి స్వల్ప గాయాలయ్యాయి, అలాగే తిరుపతి నుంచి నెల్లూరుకు సిమెంట్ లోడుతో వెళుతున్న లారీ చిల్లకూరు వడ్డిపాళెం వద్ద డివైడర్ను ఢీకొని బోల్తా పడింది. డ్రైవర్కు గాయాలయ్యాయి. వారిని స్థానికులు నాయుడుపేట ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు.
కండలేరులో
36.955 టీఎంసీలు
రాపూరు: కండలేరు జలాశయంలో ఆదివారం నాటికి 36.955 టీఎంసీల నీరు నిల్వ ఉన్నట్లు ఇన్చార్జి ఈఈ రామచంద్రమూర్తి తెలిపారు. సత్యసాయి గంగ కాలువకు 2,480, పిన్నేరు కాలువకు 10, లోలెవల్ కాలువకు 70, హైలెవల్ కాలువకు 50, మొదటి బ్రాంచ్ కాలువకు 85 క్యూసెక్కుల వంతున నీటిని విడుదల చేస్తున్నట్లు వెల్లడించారు.
నిమ్మ ధరలు (కిలో)
పెద్దవి : రూ.32
సన్నవి : రూ.25
పండ్లు : రూ.10

మోటార్బైక్ దగ్ధం

మోటార్బైక్ దగ్ధం