కలిసి...మెలిసి... అతిక్రమించారు!

West Indies players break coronavirus isolation rules in New Zealand - Sakshi

న్యూజిలాండ్‌ పర్యటనలో ఐసోలేషన్‌ గీత దాటిన విండీస్‌ ఆటగాళ్లు  

వెల్లింగ్టన్‌: న్యూజిలాండ్‌ పర్యటన కోసం వచ్చిన వెస్టిండీస్‌ ఆటగాళ్లు కరోనా వైరస్‌ ప్రొటోకాల్‌ను విస్మరించారు. క్వారంటైన్‌లో ఉన్న ఆటగాళ్లు నిబంధనల్ని అతిక్రమించి ప్రవర్తించడం న్యూజిలాండ్‌ ప్రభుత్వానికి ఆగ్రహం తెప్పించింది. 14 రోజుల క్వారంటైన్‌లో ఉన్న ఆటగాళ్లు తాము బస చేసిన హోటల్లో ఏ మాత్రం భౌతిక దూరం పాటించలేదు. పైగా భోజనాల సమయంలో ఒకరి ప్లేట్‌లోని పదార్థాల్ని ఇంకొకరు పంచుకున్నారు. ఇవన్నీ హోటల్‌లో ఏర్పాటు చేసిన సీసీటీవీల్లో రికార్డయ్యాయి. దీనిపై కివీస్‌ ఆరోగ్య శాఖ తీవ్రంగా స్పందించింది. ప్రస్తుతం 12 రోజుల క్వారంటైన్‌ పూర్తయినప్పటికీ... ఈ అతిక్రమణ వల్ల కరోన పరీక్షల్లో ఎవరికైనా పాజిటివ్‌ అని తేలితే ఐసోలేషన్‌ వ్యవధిని పొడిగిస్తారు. కరీబియన్‌ క్రికెటర్లు నిబంధనలకు విరుద్ధంగా కలిసిమెలిసి తిని తిరిగిన వీడియో ఫుటేజీలను విండీస్‌ బోర్డుకు పంపించామని కివీస్‌ ఆరోగ్యశాఖ డైరెక్టర్‌ డాక్టర్‌ ఆష్లే బ్లూమ్‌ఫీల్డ్‌ తెలిపారు.

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top