
ఐసీసీ మహిళల వన్డే బ్యాటింగ్ ర్యాంకింగ్స్లో టీమిండియా స్టార్ ఓపెనర్ స్మృతి మంధాన సత్తాచాటింది. తాజాగా ఐసీసీ ప్రకటించిన ర్యాకింగ్స్లో మంధాన తన ఆరేళ్ల నిరీక్షణకు తెరదించుతూ.. అగ్రస్ధానాన్ని కైవసం చేసుకుంది. ఇటీవల శ్రీలంక, దక్షిణాఫ్రికాతో జరిగిన ముక్కోణపు సిరీస్లో అద్బుతప్రదర్శన కనబరచడంతో మంధాన తిరిగి తన టాప్ ర్యాంక్ను సొంతం చేసుకుంది.
మంధాన ప్రస్తుతం 727 రేటింగ్ పాయింట్లతో నెం1 ర్యాంక్లో కొనసాగుతోంది. ఆ తర్వాత దక్షిణాఫ్రికా కెప్టెన్ లారా వోల్వార్డ్ట్, ఇంగ్లండ్ సారథి నాట్ స్కైవర్-బ్రంట్ 719 రేటింగ్ పాయింట్లతో రెండో స్దానంలో సంయుక్తంగా ఉన్నారు.
స్మృతి విషయానికి వస్తే గతేడాది అసాధరణ ప్రదర్శన కనబరిచింది. 2024 ఏడాదికి గానూ ఐసీసీ ఉమెన్స్ వన్డే క్రికెటర్ ఆఫ్ది ఇయర్గా మంధాన నిలిచింది. గతేడాదిలో 13 మ్యాచ్లలో 57.86 సగటుతో 747 పరుగులు చేసింది. అందులో నాలుగు సెంచరీలు ఉన్నాయి.
వన్డేల్లో ఒకే క్యాలెండర్ ఈయర్లో అత్యధిక సెంచరీలు చేసిన మహిళా క్రికెటర్గా మంధాన రికార్డులకెక్కింది. ఈ స్టార్ ఓపెనర్ ప్రస్తుతం ఇంగ్లండ్తో సిరీస్కు సన్నదమవుతోంది. వన్డే వరల్డ్కప్-2025 సన్నహాకాల్లో భాగంగా ఈ సిరీస్ జరగనుంది.
ఇంగ్లండ్ పర్యటనకు భారత మహిళా జట్టు..
భారత మహిళల వన్డే జట్టు: హర్మన్ప్రీత్ కౌర్ (కెప్టెన్), స్మృతి మంధాన (వైస్ కెప్టెన్), ప్రతీకా రావల్, హర్లీన్ డియోల్, జెమీమా రోడ్రిగ్స్, రిచా ఘోష్ (వికెట్ కీపర్), యాస్తికా భాటియా, తేజల్ హస్బానిస్, దీప్తి శర్మ, స్నేహి రాణా, శ్రీ చరణి, శ్రీ చరణి, స్నేహి రాణా, అరుంధతి రెడ్డి, క్రాంతి గౌడ్, సయాలీ సత్ఘరే.
టీ20 సిరీస్కు భారత మహిళల జట్టు: హర్మన్ప్రీత్ కౌర్ (కెప్టెన్), స్మృతి మంధాన (వైస్ కెప్టెన్), షఫాలీ వర్మ, జెమీమా రోడ్రిగ్స్, రిచా ఘోష్ (వికెట్ కీపర్), యాస్తికా భాటియా (వికెట్ కీపర్), హర్లీన్ డియోల్, దీప్తి శర్మ, స్నేహ రానా, రాధా యాదవ్, , అమన్జోత్ కౌర్, అరుంధతి రెడ్డి, క్రాంతి గౌడ్, సయాలీ సత్ఘరే.
చదవండి: WI vs AUS: వెస్టిండీస్తో టెస్టు సిరీస్.. ఆస్ట్రేలియా జట్టులో కీలక మార్పు