
టీమిండియా టెస్టు కెప్టెన్గా శుబ్మన్ గిల్ తన కెరీర్ను ఘనంగా ఆరంభించాడు. లీడ్స్ వేదికగా ఇంగ్లండ్తో ప్రారంభమైన తొలి టెస్టులో గిల్ సెంచరీతో మెరిశాడు. మొదటి ఇన్నింగ్స్లో నాలుగో స్ధానంలో బ్యాటింగ్కు వచ్చిన గిల్.. విరాట్ కోహ్లిని తలపించాడు.
తొలుత దూకుడుగా ఆడిన శుబ్మన్, జైశ్వాల్ ఔటయ్యాక ఆచిచూచి తన బ్యాటింగ్ను కొనసాగిస్తున్నాడు. ఈ క్రమంలో 140 బంతుల్లో గిల్ తన ఆరో టెస్టు సెంచరీ మార్క్ను అందుకున్నాడు. అతడి ఇన్నింగ్స్లో ఇప్పటివరకు 14 ఫోర్లు ఒక సిక్సర్ ఉన్నాయి. అతడి కంటే ముందు యువ ఓపెనర్ యశస్వి జైశ్వాల్ అద్బుత సెంచరీతో చెలరేగాడు. 159 బంతులు ఎదుర్కొన్న జైశ్వాల్ 16 ఫోర్లు, 1 సిక్సర్తో 101 పరుగులు చేశాడు. ఇక కెప్టెన్సీ డెబ్యూలో సెంచరీతో చెలరేగిన గిల్ ఓ అరుదైన రికార్డును తన పేరిట లఖించుకున్నాడు.
భారత టెస్టు కెప్టెన్గా అరంగేట్ర ఇన్నింగ్స్లో సెంచరీ చేసిన నాలుగో ప్లేయర్గా గిల్ నిలిచాడు. ఈ ఫీట్ సాధించిన జాబితాలో భారత క్రికెట్ దిగ్గజం విజయ్ హజారే అగ్రస్ధానంలో ఉన్నారు. 1951లో కెప్టెన్గా తన అరంగేట్ర ఇన్నింగ్స్లో ఇంగ్లండ్పైనే సెంచరీ చేశారు.
భారత టెస్ట్ కెప్టెన్గా తొలి ఇన్నింగ్స్లో సెంచరీ చేసిన ప్లేయర్లు వీరే..
164* విజయ్ హజారే వర్సెస్ ఇంగ్లండ్, ఢిల్లీ 1951
116 సునీల్ గవాస్కర్ vs న్యూజిలాండ్ ఆక్లాండ్ 1976
115 విరాట్ కోహ్లీ vs ఆస్ట్రేలియన్ అడిలైడ్ 2014
102*శుబ్మన్ గిల్ vs ఇంగ్లాండ్ హెడింగ్లీ 2025
భారీ స్కోర్ దిశగా భారత్..
తొలి ఇన్నింగ్స్లో టీమిండియా భారీ స్కోర్ దిశగా దూసుకుపోతుంది. 78 ఓవర్లు ముగిసే సరికి టీమిండియా 3 మూడు వికెట్ల నష్టానికి 323 పరుగులు చేసింది. క్రీజులో రిషబ్ పంత్(46), గిల్(112) ఉన్నారు.