
ఢాకా: ఐదు టి20 మ్యాచ్ల సిరీస్ ఆడేందుకు ఈనెలలో భారత మహిళల క్రికెట్ జట్టు బంగ్లాదేశ్లో పర్యటించనుంది. బంగ్లాదేశ్ బోర్డు ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం భారత జట్టు ఈనెల 23న బంగ్లాదేశ్కు చేరుకుంటుంది. మే 10వ తేదీన పర్యటన ముగించుకొని తిరిగి వెళుతుంది. సిల్హెట్లో జరిగే ఈ సిరీస్లో రెండు జట్లు ఏప్రిల్ 28, 30, మే 2, 6, 9వ తేదీల్లో ఐదు టి20 మ్యాచ్లు ఆడతాయి.