తిరుమల శ్రీవారిని దర్శించుకున్న నైనా జైస్వాల్‌ | AP: Table Tennis Player Naina Jaiswal Visited Tirumala | Sakshi
Sakshi News home page

తిరుమల నాకు ఇష్టమైన ప్రదేశం: నైనా జైస్వాల్‌

Aug 5 2021 8:49 AM | Updated on Aug 5 2021 9:58 AM

AP: Table Tennis Player Naina Jaiswal Visited Tirumala - Sakshi

సాక్షి, చిత్తూరు: ప్రముఖ టేబుల్ టెన్నిస్ క్రీడాకారిణి నైనా జైస్వాల్ గురువారం తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. ఉదయం వీఐపీ దర్శనంలో స్వామివారిని దర్శించుకున్న నైనా జైస్వాల్‌కు ఆలయ అర్చకులు ఆశీర్వదించి తీర్ధప్రసాదాలు అందజేవారు. అనంతరం ఆలయం వెలుపల మీడియాతో మాట్లాడుతూ.. తిరుమల నాకు ఇష్టమైన క్షేత్రమని అన్నారు. టీటీడీ కోవిడ్ నిబంధనలు పాటిస్తుందని, భక్తులు కూడా పాటించాలని కోరారు. త్వరలోనే నా పీహెచ్‌డీ పూర్తి కానుంది. అతి పిన్న వయస్సులో పీహెచ్‌డీ పూర్తి చేసుకోనున్నానని నైనా జైస్వాల్ అన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement