జయశంకర్‌ స్ఫూర్తిని కొనసాగిద్దాం | - | Sakshi
Sakshi News home page

జయశంకర్‌ స్ఫూర్తిని కొనసాగిద్దాం

Jun 22 2026 7:03 AM | Updated on Jun 22 2026 7:03 AM

మిరుదొడ్డి(దుబ్బాక): ప్రత్యేక రాష్ట్ర సాధన కోసం మలి దశ ఉద్యమానికి సిద్ధాంత కర్తగా నిలిచిన తెలంగాణ జాతిపిత ప్రొఫెసర్‌ జయశంకర్‌ ఆశయ సాధనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని రైతు రక్షణ వేదిక జిల్లా అధ్యక్షుడు అందె ప్రవీణ్‌ అన్నారు. ఆదివారం మండల పరిధిలోని అందె ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో విద్యార్థులతో కలిసి జయశంకర్‌ వర్ధంతి కార్యక్రమం నిర్వహించారు. జయశంకర్‌ చిత్ర పటానికి పూల మాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జయశంకర్‌ సార్‌ను స్ఫూర్తిగా తీసుకుని రాష్ట్ర అభివృద్ధి, రైతుల సంక్షేమం, యువతకు ఉపాధి సంక్షేమ అవకాశాల కల్పన కోసం అధికార పాలనా యంత్రాంగం సమష్టిగా కృషి చేయాల్సిన అవసరం ఉందన్నారు. కార్యక్రమంలో సర్పంచ్‌ యాదగిరి, ఉప సర్పంచ్‌ పర్శరాములు, పాఠశాల ప్రధానోపాధ్యాయుడు రాములు, నాయకులు రాజ్‌కుమార్‌, రాజేందర్‌, పోచయ్య, లక్ష్మీనారాయణ, రాంరెడ్డి, టీచర్లు తదితరులు పాల్గొన్నారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement