జిల్లాలో 30 వేలకు పైగా దరఖాస్తులు | - | Sakshi
Sakshi News home page

జిల్లాలో 30 వేలకు పైగా దరఖాస్తులు

Jun 19 2025 7:58 AM | Updated on Jun 19 2025 7:58 AM

జిల్లాలో 30 వేలకు పైగా దరఖాస్తులు

జిల్లాలో 30 వేలకు పైగా దరఖాస్తులు

జగదేవ్‌పూర్‌(గజ్వేల్‌)/మర్కూక్‌(గజ్వేల్‌): భూ భారతి సదస్సుల ద్వారా ఇప్పటి వరకు 30,630 దరఖాస్తులు వచ్చాయని అదనపు కలెక్టర్‌ అబ్దుల్‌ హమీద్‌ వెల్లడించారు. జగదేవ్‌పూర్‌లో బుధవారం నిర్వహించిన భూభారతి సదస్సును హాజరై దరఖాస్తులను స్వీకరించారు. అంతకుముందు మర్కూక్‌ మండలంలోని పాతూర్‌ గ్రామంలో ఏర్పాటు చేసిన రెవెన్యూ సదస్సును సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ...ఈ నెల 3 నుంచి ప్రారంభమైన సదస్సులు 20 వరకు కొనసాగుతాయన్నారు. రైతుల నుంచి సాదాబైనామా, పేర్లు తప్పిదాలు, ఆన్‌లైన్‌లో సర్వే నంబర్లు తప్పిదం, అసైన్డ్‌ భూమికి సంబంధించిన దరఖాస్తులు వస్తున్నాయని వివరించారు. కార్యక్రమంలో తహసీల్దార్లు నిర్మల, ప్రవీణ్‌రెడ్డి, ఆర్‌ఐ ఫహీద్‌, పీఏసీఎస్‌ చైర్మన్‌ ఇంద్రసేనారెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement