
కలెక్టర్ను కలిసిన సీపీ అనురాధ
సిద్దిపేటరూరల్: నూతన కలెక్టర్ కె.హైమావతిని సిద్దిపేట పోలీస్ కమిషనర్ డా.అనురాధ బుధవారం కలెక్టరేట్లోని తన చాంబర్లో మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా కలెక్టర్కు మొక్కను బహూకరించారు. శాంతిభద్రతలకు సంబంధించి కొద్దిసేపు చర్చించారు. సీపీ వెంట అదనపు డీసీపీ అడ్మిన్ సుభాష్చంద్రబోస్, ఏసీపీ రవీందర్రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
పారదర్శకంగా ఇందిరమ్మ లబ్ధిదారుల ఎంపిక
డీఆర్డీవో జయదేవ్ ఆర్య
దుబ్బాక: ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారుల ఎంపిక పూర్తిగా పారదర్శకంగా చేపట్టినట్లు డీఆర్డీవో జయదేవ్ ఆర్య పేర్కొన్నారు. త్వరలోనే జిల్లా ఇన్చార్జి మంత్రి వివేక్ వెంకటస్వామి చేతుల మీదుగా లబ్ధిదారులకు మంజూరు పత్రాలను అందజేయనున్నట్లు ఆయన తెలిపారు. దుబ్బాక పట్టణంలోని కోమటిరెడ్డి రజనీకాంత్రెడ్డి ఫంక్షన్ హాల్ను బుధవారం సందర్శించి మంత్రి పర్యటన ఏర్పాట్లను పరిశీలించారు. మంత్రి వివేక్ పర్యటన నేపథ్యంలో అన్ని ఏర్పాట్లను చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. కార్యక్రమంలో ఆర్డీవో సదానందం, తహసీల్దార్ సంజీవ్కుమార్ తదితరులు పాల్గొన్నారు.
పల్లెలకు డ్రగ్స్ను రానివ్వొద్దు
హుస్నాబాద్రూరల్: పల్లెలకు డ్రగ్స్కు రాకుండా యువతను కాపాడుకునే బాధ్యత తల్లిదండ్రులపైనే ఉందని డ్రగ్స్ నిర్మూలన జేఏసీ కన్వీనర్ కవ్వ లక్ష్మారెడ్డి పేర్కొన్నారు. జేఏసీ ఆధ్వర్యంలో బుధవారం చేపట్టిన డ్రగ్స్ నిర్మూలన యాత్ర మండలంలో పందిల్ల, పొట్లపల్లి, రాములపల్లి, బంజేరుపల్లి, కూచనపెల్లి గ్రామాల్లో సాగింది. ఈ సందర్భంగా వక్తలు మాట్లాడుతూ..మన యువతను ఆన్లైన్ బె ట్టింగ్, సైబర్ నేరాలకు దూరంగా ఉంచాలన్నా రు. గ్రామాలకు డ్రగ్స్ రాకుండా కమిటీలను ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో జేఏసీ నాయకులు మేకల వీరన్న, సారయ్య తదితరులు పాల్గొన్నారు.
జిల్లాస్థాయి పోటీలకు
ఇద్దరు విద్యార్థుల ఎంపిక
మర్కూక్(గజ్వేల్): తెలంగాణ రాష్ట్ర క్రీడా పాఠశాలల ప్రవేశాల కోసం మర్కూక్ మండలం నుంచి జిల్లా స్థాయికి ఇద్దరు విద్యార్థులు ఎంపికయ్యారు. ఎర్రవల్లి ప్రాథమికోన్నత పాఠశాలకు చెందిన జూపల్లి భానుప్రసాద్, తాండె సాత్విక్ మండలంలోని పాములపర్తి పాఠశాలలో బుధవారం నిర్వహించిన మండల స్థాయి క్రీడా పోటీలలో గెలుపొందారు. ఈ మేరకు మండల విద్యాధికారి వెంకట్ రాములు ఓ ప్రకటనలో వెల్లడించారు.
విద్యతో పాటు
క్రీడల్లో రాణించాలి
హుస్నాబాద్: విద్యార్థులు విద్యతోపాటు క్రీడల్లోనూ రాణించాలని జిల్లా యువజన, క్రీడా శాఖ అధికారి జంగపల్లి వెంకట నర్సయ్య పేర్కొన్నారు. ప్రభుత్వ బాలుర ఉన్నత పాఠశాలలో తెలంగాణ స్పోర్ట్స్ స్కూల్ ఎంపిక కోసం మండలస్థాయి పోటీలను బుధవారం ఎంఈఓ బండారి మనీల ఆధ్వర్యంలో నిర్వహించారు. ఎంపిక పోటీలను డీవైఎస్ఓ వెంకట నర్సయ్య పర్యవేక్షించారు. ఈ సందర్భంగా ఆయన మా ట్లాడుతూ...విద్యార్థి దశ నుంచే క్రీడలపై ఆసక్తి పెంచుకోవాలన్నారు. క్రీడల వల్ల మంచి ఆరోగ్యంతో పాటు క్రమశిక్షణ అలవడుతుంద ని చెప్పారు. విద్యార్థులు రాష్ట్ర, జాతీయ స్థ్ధాయి ల్లో రాణించాలని కోరారు. కార్యక్రమంలో పాఠశాల హెచ్ఎం వాసుదేవ రెడ్డి, ఎస్జీఎఫ్ కార్యదర్శి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.

కలెక్టర్ను కలిసిన సీపీ అనురాధ

కలెక్టర్ను కలిసిన సీపీ అనురాధ