
ప్రభుత్వ జూనియర్ కళాశాలలో చోరీ
కౌడిపల్లి(నర్సాపూర్): మండల కేంద్రంలో ఉన్న ప్రభుత్వ జూనియర్ కళాశాలలో చోరీ జరిగింది. కౌడిపల్లి ఎస్ఐ రంజిత్రెడ్డి కథనం ప్రకారం... శుక్రవారం సాయంత్రం రోజు మాదిరిగా కళాశాల సమయం ముగియగానే తాళాలు వేశారు. శని, ఆదివారం సెలవు కావడంతో సోమవారం యథావిధిగా కళాశాలకు రాగా.. ఆఫీస్రూం, స్టాఫ్రూం, వాటర్ ప్లాంట్ గది తాళాలు ధ్వంసమై ఉన్నాయి. చోరీకి పాల్పడ్డ దొంగలు కెమిస్ట్రీ ల్యాబ్కు సంబంధించిన రెండు గ్యాస్ సిలిండర్లు, వాటర్ ప్లాంట్ గదిలో నుంచి వన్హెచ్పీ మోటార్ తీసుకొచ్చి బయటపెట్టాడు. ఒక గ్యాస్ సిలిండర్, మోటార్ను చోరీ చేశారు. మరో సిలిండర్ గోడ పక్కన పెట్టగా, ఆఫీస్రూంలోని రెండు కంప్యూటర్లు, మానిటర్, మౌస్, కీబోర్డు, సీసీ కెమెరాను బ్యాగ్లో పెట్టుకుని వరండాలోనే వదిలేసి వెళ్లాడు. సీసీ కెమెరాలు శనివారం మధ్యాహ్నం వరకు పనిచేశాయని, ఆ తరువాత పనిచేయలేదని ప్రిన్సిపాల్ చెప్పారు. క్లూస్టీం అధికారులు చోరీకి సంబంధించి ఆధారాలు సేకరించారు. పోలీసుల కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
గ్యాస్ సిలిండర్, మోటార్ అపహరణ