నంగునూరు(సిద్దిపేట): వ్యవసాయ పనుల నిమిత్తం పొలం వద్దకు వెళ్లిన రైతు బావిలో పడి మృతి చెందాడు. ఈ ఘటన సోమవారం నాగరాజుపల్లిలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... గ్రామానికి చెందిన ముక్కెర రాజయ్య(50) వ్యవసాయ పనుల నిమిత్తం పొలం వద్దకు వెళ్లాడు. సాయంత్రం వరకు ఇంటికి తిరిగి రాలేదు. ఆయన ఆచూకీ కోసం వెతకగా సొంత వ్యవసాయ బావిలో చెప్పులు కనిపించాయి. ఘటనా స్థలానికి ఎస్ఐ అసీఫ్ చేరుకొని ఫైర్ సిబ్బందిని పిలిపించారు. రెండు గంటల పాటు శ్రమించి మృతదేహాన్ని బయటకు తీశారు. పోస్ట్మార్టం నిమిత్తం సిద్దిపేట ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.
బావిలో పడి రైతు మృతి