ఎఫ్‌సీడీఏ కార్యాలయం ఎదుట జెండా ఆవిష్కరణ | - | Sakshi
Sakshi News home page

ఎఫ్‌సీడీఏ కార్యాలయం ఎదుట జెండా ఆవిష్కరణ

Sep 18 2026 8:18 AM | Updated on Sep 18 2026 8:18 AM

ఎఫ్‌సీడీఏ కార్యాలయం ఎదుట జెండా ఆవిష్కరణ కందుకూరు: ప్రజాపాలన దినోత్సవాన్ని పురస్కరించుకుని ఫ్యూచర్‌సిటీలోని ఎఫ్‌సీడీఏ కార్యాలయం ఎదుట ఎఫ్‌సీడీఏ అదనపు కమిషనర్‌ వెంకటేశ్వర్లు జాతీయ జెండాను ఆవిష్కరించారు. కార్యక్రమంలో ఏఓ మహేందర్‌, ప్లానింగ్‌ అధికారి స్నేహమాల తదితరులు పాల్గొన్నారు. నిమజ్జన ఏర్పాట్ల పరిశీలన తుర్కయంజాల్‌: గణేశ్‌ నిమజ్జనానికి నగరంతో పాటు శివారు ప్రాంతాల నుంచి పెద్ద ఎత్తున విగ్రహాలు తరలివచ్చే అవకాశం ఉన్నందున భక్తులకు ఇబ్బందులు తలెత్తకుండా ఏర్పాట్లు పూర్తి చేయాలని శంషాబాద్‌ డీసీపీ రాజేష్‌, ఆదిభట్ల ఏసీపీ ప్రదీప్‌ కుమార్‌ రెడ్డి అన్నారు. తుర్కయంజాల్‌లోని మాసబ్‌ చెరువులో చేపడుతున్న నిమజ్జన ప్రక్రియను గురువారం వారు పరిశీలించారు. నిమజ్జనాన్ని పరిశీలించేందుకు సీసీ కెమెరాలు ఏర్పాటు చేశామని, ట్రాఫిక్‌ నియంత్రణ, పార్కింగ్‌, భద్రత, రద్దీ నియంత్రణకు తగిన చర్యలు తీసుకోవాలని సూచించారు. అన్ని శాఖల అధికారులు సమన్వయంతో ప్రశాంత వాతావరణంలో నిమజ్జనం పూర్తయ్యేలా చూడాలని కోరారు. కార్యక్రమంలో సీఐ రమేష్‌, ఎస్‌ఐలు సైదులు, వెంకటేశ్‌ తదితరులు పాల్గొన్నారు. పోలీసులకు సహకరించాలి నిమజ్జనం ప్రశాంతంగా సాగాలి దరఖాస్తుల ఆహ్వానం

ఇబ్రహీంపట్నం: గణేశ్‌ నిమజ్జన ఏర్పాట్లను మహేశ్వరం జోన్‌ డీసీపీ కె.నారాయణరెడ్డి గురువారం పరిశీలించారు. మున్సిపల్‌ పరిధిలోని శేరిగూడ చెక్‌ డ్యాం వద్ద చేపట్టిన ఏర్పాట్లను పరిశీలించి ఏసీపీ కేపీవీ రాజు, సీఐ మహేందర్‌రెడ్డికి ట్రాఫిక్‌ నియంత్రణ, బందోబస్తు, పార్కింగ్‌, విద్యుత్‌ అంశాలపై పలు సూచనలు చేశారు. ఈ సందర్భంగా నారాయణరెడ్డి మాట్లాడుతూ.. గణేశ్‌ నవరాత్రోత్సవాలు, నిమజ్జన కార్యాక్రమాలు ప్రశాంతంగా జరుపుకోవాలన్నారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా నిమజ్జనానికి అవసరమైన ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు. పోలీసులకు సహకరించాలని కోరారు.

షాబాద్‌: వినాయక నిమజ్జన ఊరేగింపు శాంతియుత వాతావరణంలో జరుపుకోవాలని చేవెళ్ల డీసీపీ యోగేష్‌ గౌతమ్‌ సూచించారు. షాబాద్‌ బడా వినాయకుడి వద్ద గురువారం ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం ఉత్సవ కమిటీ సభ్యులతో మాట్లాడారు. పైల్వాన్‌ చెరువును సందర్శించి నిమజ్జన ఏర్పాట్లు, భద్రతపై సీఐ లక్ష్మిరెడ్డి, అధికారులను అడిగి తెలుసుకున్నారు. నిమజ్జానికి వచ్చే భక్తులు, ఉత్సవ కమిటీ సభ్యులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని ఆదేశించారు. చెరువు పరిసరాల్లో భద్రత కట్టుదిట్టం చేయాలని, ట్రాఫిక్‌ నియంత్రణపై ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. ఆయన వెంట చేవెళ్ల ఏసీపీ కిషన్‌, సర్పంచ్‌ అశోక్‌, ఉత్సవ కమిటీ సభ్యులు ఉన్నారు.

ఇబ్రహీంపట్నం రూరల్‌: జిల్లాలోని కేజీబీవీ కిస్మత్‌పూర్‌, దర్గా ఖలీజ్ఞాన్‌లో వంట పని నిమిత్తం మహిళల నుంచి దరఖాస్తులు స్వీకరిస్తున్నట్లు జిల్లా విద్యాశాఖ కార్యాలయం గురువారం నోటిఫికేషన్‌ జారీ చేసింది. మొత్తం మూడు ఖాళీలు ఉన్నాయని, ఆసక్తిగల మహిళలు దరఖాస్తు చేసుకోవాలని కోరింది. నెలకు గౌరవ వేతనం రూ. 9,750 చెల్లిస్తారని, దరఖాస్తు ఫారాలను ఆయా కేజీబీవీల్లో సమర్పించాలని సూచించింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement